ఇకపై 'తక్కువ' ధరలకు విక్రయం కుదరదు.. యూఏఈలో కొత్త పోటీ చట్టం
- July 12, 2024
యూఏఈ: ఇతర కంపెనీలను పోటీ నుండి తరిమికొట్టడానికి అతి తక్కువ ధరలను అందించడం యూఏఈలో ఇక కుదరదు.ఈ మేరకు యూఏఈలో కొత్త పోటీ చట్టం వచ్చింది. ఇది చాలా తక్కువ ధరలకు వస్తువులను విక్రయించాన్ని నిషేధిస్తోంది. వినియోగదారుల ప్రయోజనాలకు హాని కలిగించకుండానే న్యాయమైన పోటీ ఉండేలా చూస్తోంది. అన్ని కంపెనీలకు గుత్తాధిపత్య విధానాలను నిషేధించడం, దేశంలో వినియోగదారుల హక్కులను పరిరక్షించడం లక్ష్యంగా పెట్టుకుంది. న్యాయమైన పోటీ పద్ధతులను నిర్ధారించడానికి తనిఖీల కోసం మంత్రిత్వ శాఖ స్థానిక అధికారులతో కలిసి పర్యవేక్షించనుంది. అయితే, చట్టాన్ని ఉల్లంఘించే కంపెనీలకు జరిమానాలను కేబినెట్ సమీక్షించిన అనంతరం వెల్లడిస్తామని ఆర్థిక మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ అబ్దుల్లా అహ్మద్ అల్ సలేహ్ తెలిపారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







