ప్రైవేటు సంస్థలకు 'సర్వైలెన్స్' తప్పనిసరి
- June 14, 2016
సర్వైలెన్స్ కెమెరాలను ప్రైవేటు విద్యా సంస్థలు, కమర్షియల్, ఇండస్ట్రియల్ మరియు చారిటీ ఎస్టాబ్లిష్మెంట్స్, ఇతర ప్రైవేటు సంస్థలకు తప్పనిసరి చేస్తూ బహ్రెయిన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆరు నెలల్లోగా ఈ సర్వైలెన్స్ కెమెరాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. మే 23న ఇంటీరియర్ మినిస్టర్ లెఫ్టినెంట్ జనరల్ షేక్ రషిద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫా ఈ రిజల్యూషన్ని విడుదల చేశారు. జూన్ 9న గెజిట్లో ఈ రిజల్యూషన్ చేర్చబడింది. సర్వైలెన్స్ కెమెరాలు ఇరవై నాలుగ్గంటలూ పనిచేయాల్సి ఉంటుంది. అలాగే 120 రోజుల వీడియో రికార్డింగ్ని ఇందులో పొందుపర్చాలి. అత్యవసర సందర్భాల్లో జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ వర్గాలకు ఈ 120 రోజుల వీడియో రికార్డింగ్ని అందివ్వాల్సి ఉంటుంది. అనుమతి లేకుండా వీడియోలను బహిర్గతం చేయడం, ట్రాన్స్ఫర్ చేయడం, స్టోరేజ్ చేయడం నేరం. బెడ్రూమ్లు, ఫిజియోథెరపీ రూమ్లు, రెస్ట్ రూమ్స్, చేంజింగ్ రూమ్స్ మరియు మహిళలకు కేటాయించిన ప్రైవేటు రూమ్లలో వీటి వినియోగం కూడా నేరమే.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







