Dh824,604.17 బంగారం చోరీ.. ముగ్గురికి జైలుశిక్ష, బహిష్కరణ వేటు

- July 15, 2024 , by Maagulf
Dh824,604.17 బంగారం చోరీ.. ముగ్గురికి జైలుశిక్ష, బహిష్కరణ వేటు

దుబాయ్: దుబాయ్ జ్యువెలరీ కంపెనీ నుండి Dh824,604.17 విలువైన బంగారం దొంగిలించినందుకు ముగ్గురు వ్యక్తులకు జైలు శిక్ష మరియు బహిష్కరణ శిక్ష విధించారు. దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు 2023 సెప్టెంబర్ 28న దుబాయ్‌లోని నైఫ్ ప్రాంతంలో చేసిన నేరాలకు సంబంధించి నిందితులు, ఇద్దరు ఈజిప్షియన్లు మరియు ఒక భారతీయుడిపై అభియోగాలు మోపారు. ఫేక్ గోల్డ్ మేకింగ్ వర్క్‌షాప్‌ను స్థాపించి కంపెనీ పేరుతో కార్మికులను నియమించుకోవడం ద్వారా కంపెనీలో బంగారాన్ని దోపిడీ చేశారు. కేసు విచారించిన కోర్టు మొదటి, రెండో నిందితులను దోషులుగా నిర్ధారించి మూడు నెలల జైలు శిక్ష విధించారు. వారికి సంయుక్తంగా Dh824,604.17 జరిమానా విధించారు. శిక్షాకాలం ముగిసిన తర్వాత వారిని బహిష్కరించాలని న్యాయమూర్తులు ఆదేశించారు. మూడవ నిండుతునికి ఒక నెల జైలు శిక్ష మరియు Dh236,823 జరిమానా విధించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com