ఏపీలో మరో కొత్త చట్టం..!
- July 16, 2024
అమరావతి: ఏపీలో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకొస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. తాము భూ యజమానులం అని కబ్జాదారులే నిరూపించుకోవాలని వెల్లడించారు. భవిష్యత్తులో భూమి కబ్జా చేయాలంటే భయపడేలా చేస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. భూములు, ఆస్తులు కబ్జాకు గురైతే ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలని సూచించారు. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ను గుజరాత్ లో అమలు చేస్తున్నారని తెలిపారు. అదే తరహాలో ఏపీలోనూ ఇంప్లిమెంట్ చేస్తామన్నారు. భూ హక్కు పత్రం పేరుతో ప్రచారానికి వైసీపీ రూ.13 కోట్లు ఖర్చు చేసిందని చంద్రబాబు ఆరోపించారు. భూముల రీ సర్వే పేరుతో జగన్ చిత్రం ముద్రించుకున్నారని, ల్యాండ్ టైటిలింగ్ చట్టం మేరకు ప్రైవేట్ వ్యక్తులను నియమించవచ్చని తెలిపారు.
ఎంతో అహంభావంతో జగన్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చారని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఆ చట్టం దురుద్దేశాలను ప్రజలు గహించారన్న సీఎం చంద్రబాబు.. అందుకే ఎన్నికల్లో వైసీపీకి బుద్ధి చెప్పారని వ్యాఖ్యానించారు. ఒకసారి తమ భూములను చెక్ చేసుకోవాలని ప్రజలకు సూచించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఎవరూ అధైర్య పడొద్దని, ధైర్యంగా ఫిర్యాదు చేయాలన్నారు. కబ్జా చేసిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించేబోమని తేల్చి చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు.
తాజా వార్తలు
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్కు ఆహ్వానం
- దుబాయ్ పోలీసుల్లో 36 ఆర్పీఏ రోబోలు..
- తెలంగాణలో కొత్త క్రిమినల్ చట్టాల అమలు పై NCRB డైరెక్టర్ సమీక్ష
- ఏపీలో వేసవిని తలపిస్తున్న ఎండలు
- కల్తీ మద్యం తాగి 14 మంది మృతి..
- ISRO ప్రైవేటీకరణపై క్లారిటీ ఇవ్వండి
- సౌదీ-మలేషియా జాయింట్ ఆపరేషన్.. డ్రగ్ నెట్వర్క్ బస్ట్..!!
- హవల్లీ, ముబారక్ అల్-కబీర్ ప్రాంతాల్లో పలుచోట్ల పవర్ కట్..!!
- కతారా హాస్పిటాలిటీ.. హోటళ్లు, రిసార్టుల్లో 40 శాతం వరకు ఆదా..!!
- దుబాయ్ హోటల్ ధరలకు రెక్కలు..175 శాతం వరకు పెంపు..!!







