ఏపీలో మరో కొత్త చట్టం..!
- July 16, 2024
అమరావతి: ఏపీలో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకొస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. తాము భూ యజమానులం అని కబ్జాదారులే నిరూపించుకోవాలని వెల్లడించారు. భవిష్యత్తులో భూమి కబ్జా చేయాలంటే భయపడేలా చేస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. భూములు, ఆస్తులు కబ్జాకు గురైతే ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలని సూచించారు. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ను గుజరాత్ లో అమలు చేస్తున్నారని తెలిపారు. అదే తరహాలో ఏపీలోనూ ఇంప్లిమెంట్ చేస్తామన్నారు. భూ హక్కు పత్రం పేరుతో ప్రచారానికి వైసీపీ రూ.13 కోట్లు ఖర్చు చేసిందని చంద్రబాబు ఆరోపించారు. భూముల రీ సర్వే పేరుతో జగన్ చిత్రం ముద్రించుకున్నారని, ల్యాండ్ టైటిలింగ్ చట్టం మేరకు ప్రైవేట్ వ్యక్తులను నియమించవచ్చని తెలిపారు.
ఎంతో అహంభావంతో జగన్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చారని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఆ చట్టం దురుద్దేశాలను ప్రజలు గహించారన్న సీఎం చంద్రబాబు.. అందుకే ఎన్నికల్లో వైసీపీకి బుద్ధి చెప్పారని వ్యాఖ్యానించారు. ఒకసారి తమ భూములను చెక్ చేసుకోవాలని ప్రజలకు సూచించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఎవరూ అధైర్య పడొద్దని, ధైర్యంగా ఫిర్యాదు చేయాలన్నారు. కబ్జా చేసిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించేబోమని తేల్చి చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







