గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్, 2 చిన్నారులు మృతి, 7 మందికి గాయాలు
- March 15, 2026
చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నై సమీపంలోని నవలూరులో ఆదివారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఒక ఇంట్లో LPG గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలిపోవడంతో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.ఈ ప్రమాదంలో మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.
పాత మహాబలిపురం రోడ్ సమీపంలోని నవలూరు, చాముండేశ్వరి నగర్ 3వ వీధిలో ఈ ప్రమాదం జరిగింది. ఉదయం సుమారు 7:40 గంటల సమయంలో భారీ పేలుడు శబ్దం వినిపించడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం సంజయ్ కుమార్ అనే వ్యక్తి ఇంట్లో గ్యాస్ లీక్ కావడంతో స్టవ్ వెలిగించే సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. పేలుడు తీవ్రతకు ఆ ఇంటి గ్రౌండ్ ఫ్లోర్ పూర్తిగా కూలిపోయింది. పక్కనే ఉన్న మరో రెండు ఇళ్లు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి.
ఈ ప్రమాదంలో సంజయ్ కుమార్, సోనియా దంపతుల కుమారుడు ధీరన్ (18 నెలలు), కుమార్తె కృతిక (4 సంవత్సరాలు) అక్కడికక్కడే మృతి చెందారు. తమ పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులు విషాదంలో మునిగిపోయారు.
గాయపడిన వారిలో సంజయ్ (31), సోనియా (26), వారి బంధువు చిత్ర (46), పొరుగున ఉన్న ప్రదీప్ (7) సహా మొత్తం ఏడుగురు ఉన్నారు. వీరందరికీ తీవ్రమైన కాలిన గాయాలు కావడంతో వెంటనే చెంగల్పట్టు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
సమాచారం అందుకున్న వెంటనే తాళంబూర్ పోలీసులు, సిరిశేరి అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని స్థానికుల సహాయంతో బయటకు తీశారు.
గ్యాస్ కొరత భయంతో ఆ ఇంట్లో అదనంగా సిలిండర్లు నిల్వ ఉంచినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వాటిలో ఒకటి నుంచి గ్యాస్ లీక్ అవ్వడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు.
ఈ ఘటనతో నవలూరు ప్రాంతంలో విషాద వాతావరణం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గ్యాస్ సిలిండర్లను ఉపయోగించే సమయంలో జాగ్రత్తలు పాటించాలని అధికారులు ప్రజలకు సూచించారు.
తాజా వార్తలు
- సింగపూర్ CII సమ్మిట్లో సీఎం చంద్రబాబు
- 14 లక్షల మంది రైతులకు రూ.75,000 రుణమాఫీ!
- అపోలో హెల్త్టెక్ ఎగ్జిక్యూటివ్ ఛైర్పర్సన్గా శోభన కామినేని
- ఖతార్ లో రెండవ సెమిస్టర్ ఫలితాలు విడుదల..!!
- దుబాయ్ లో క్రికెట్ ఆడుతూ కర్ణాటక వాసి మృతి..ఘనంగా నివాళులు..!!
- షార్జా బ్యాంక్ మిలియనీర్ క్యాంపెయిన్..Dh2 మిలియన్లు గెలిచిన భారత ప్రవాసి..!!
- మక్కాలో పవిత్ర కాబాను కొత్త 'కిస్వా'తో అలంకరణ..!!
- ఆర్థిక ఉపశమన ప్యాకేజీని ప్రకటించిన ఒమన్..!!
- T4 టెర్మినల్ నుంచి ఒకే ఫారీన్ ఫ్లైట్ కు అనుమతి..!!
- తల్లి ఇంటికి నిప్పు పెట్టిన వ్యక్తికి ఐదేళ్ల జైలు శిక్ష..!!









