ఒమన్ కాల్పులకు బాధ్యత వహిస్తూ ‘దాష్’ ప్రకటన..!
- July 17, 2024
మస్కట్: ఒమన్లోని మసీదుపై కాల్పులు జరిపిన ఘటనలో ముగ్గురు దాడికి పాల్పడిన వారితో సహా కనీసం తొమ్మిది మంది మరణించిన ఘటనకు బాధ్యత వహిస్తూ దాష్(daesh) ఒక ప్రకటన విడుదల చేసింది. తుపాకీ దాడిలో మరణించిన వారిలో నలుగురు పాకిస్థానీయులు, ఒక భారతీయుడు మరియు ఒక పోలీసు అధికారి ఉన్నట్లు పాకిస్థానీ, భారత్ మరియు ఒమన్ అధికారులు తెలిపారు. భద్రతా సిబ్బందితో సహా వివిధ దేశాలకు చెందిన 28 మంది గాయపడ్డారని ఒమన్ రాయల్ పోలీసులు తెలిపారు. ఒమన్ రాజధాని మస్కట్లోని వాడి అల్ కబీర్ పరిసరాల్లోని ఇమామ్ అలీ మసీదులో సోమవారం సాయంత్రం దాడి ప్రారంభమైనట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్కు ఆహ్వానం
- దుబాయ్ పోలీసుల్లో 36 ఆర్పీఏ రోబోలు..
- తెలంగాణలో కొత్త క్రిమినల్ చట్టాల అమలు పై NCRB డైరెక్టర్ సమీక్ష
- ఏపీలో వేసవిని తలపిస్తున్న ఎండలు
- కల్తీ మద్యం తాగి 14 మంది మృతి..
- ISRO ప్రైవేటీకరణపై క్లారిటీ ఇవ్వండి
- సౌదీ-మలేషియా జాయింట్ ఆపరేషన్.. డ్రగ్ నెట్వర్క్ బస్ట్..!!
- హవల్లీ, ముబారక్ అల్-కబీర్ ప్రాంతాల్లో పలుచోట్ల పవర్ కట్..!!
- కతారా హాస్పిటాలిటీ.. హోటళ్లు, రిసార్టుల్లో 40 శాతం వరకు ఆదా..!!
- దుబాయ్ హోటల్ ధరలకు రెక్కలు..175 శాతం వరకు పెంపు..!!







