గాజాలో చనిపోయిన తల్లి గర్భం నుంచి నవజాత శిశువు జననం..!
- July 21, 2024
గాజా స్ట్రిప్: ఇజ్రాయెల్ దాడిలో తగిలిన గాయాలతో మరణించిన తల్లి కడుపు నుండి ఒక మగబిడ్డను సురక్షితంగా రక్షించినట్లు గాజా ఆసుపత్రి తెలిపింది. తొమ్మిది నెలల గర్భిణి అయిన ఓలా అద్నాన్ హర్బ్ అల్-కుర్ద్ క్షిపణి దాడులలో తీవ్రంగా గాయపడింది పేర్కొన్నారు. కుర్ద్ అల్-అవ్దా ఆసుపత్రికి చేరుకునే సమయానికి, ఆమె దాదాపు చనిపోయిందని సర్జన్ అక్రమ్ హుస్సేన్ తెలిపారు. వైద్యులు తల్లిని రక్షించలేకపోయారని కానీ శిశువు గుండె చప్పుడిని అల్ట్రాసౌండ్ ద్వారా గుర్తించి అత్యవసరంగా సిజేరియన్ చేసి శిశువును రక్షించమని సర్జన్ చెప్పారు. శిశువు పరిస్థితి మొదట్లో విషమంగా ఉందని, అయితే ఆక్సిజన్ మరియు వైద్య సహాయం అందించిన తర్వాత కోలుకున్నట్లు తెలిపారు. అతన్ని ఇంక్యుబేటర్లో పెట్టమని, డీర్ ఎల్-బలాహ్లోని అల్-అక్సా ఆసుపత్రికి తరలించినట్టు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్







