గాజాలో చనిపోయిన తల్లి గర్భం నుంచి నవజాత శిశువు జననం..!
- July 21, 2024
గాజా స్ట్రిప్: ఇజ్రాయెల్ దాడిలో తగిలిన గాయాలతో మరణించిన తల్లి కడుపు నుండి ఒక మగబిడ్డను సురక్షితంగా రక్షించినట్లు గాజా ఆసుపత్రి తెలిపింది. తొమ్మిది నెలల గర్భిణి అయిన ఓలా అద్నాన్ హర్బ్ అల్-కుర్ద్ క్షిపణి దాడులలో తీవ్రంగా గాయపడింది పేర్కొన్నారు. కుర్ద్ అల్-అవ్దా ఆసుపత్రికి చేరుకునే సమయానికి, ఆమె దాదాపు చనిపోయిందని సర్జన్ అక్రమ్ హుస్సేన్ తెలిపారు. వైద్యులు తల్లిని రక్షించలేకపోయారని కానీ శిశువు గుండె చప్పుడిని అల్ట్రాసౌండ్ ద్వారా గుర్తించి అత్యవసరంగా సిజేరియన్ చేసి శిశువును రక్షించమని సర్జన్ చెప్పారు. శిశువు పరిస్థితి మొదట్లో విషమంగా ఉందని, అయితే ఆక్సిజన్ మరియు వైద్య సహాయం అందించిన తర్వాత కోలుకున్నట్లు తెలిపారు. అతన్ని ఇంక్యుబేటర్లో పెట్టమని, డీర్ ఎల్-బలాహ్లోని అల్-అక్సా ఆసుపత్రికి తరలించినట్టు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







