గాజాలో చనిపోయిన తల్లి గర్భం నుంచి నవజాత శిశువు జననం..!
- July 21, 2024
గాజా స్ట్రిప్: ఇజ్రాయెల్ దాడిలో తగిలిన గాయాలతో మరణించిన తల్లి కడుపు నుండి ఒక మగబిడ్డను సురక్షితంగా రక్షించినట్లు గాజా ఆసుపత్రి తెలిపింది. తొమ్మిది నెలల గర్భిణి అయిన ఓలా అద్నాన్ హర్బ్ అల్-కుర్ద్ క్షిపణి దాడులలో తీవ్రంగా గాయపడింది పేర్కొన్నారు. కుర్ద్ అల్-అవ్దా ఆసుపత్రికి చేరుకునే సమయానికి, ఆమె దాదాపు చనిపోయిందని సర్జన్ అక్రమ్ హుస్సేన్ తెలిపారు. వైద్యులు తల్లిని రక్షించలేకపోయారని కానీ శిశువు గుండె చప్పుడిని అల్ట్రాసౌండ్ ద్వారా గుర్తించి అత్యవసరంగా సిజేరియన్ చేసి శిశువును రక్షించమని సర్జన్ చెప్పారు. శిశువు పరిస్థితి మొదట్లో విషమంగా ఉందని, అయితే ఆక్సిజన్ మరియు వైద్య సహాయం అందించిన తర్వాత కోలుకున్నట్లు తెలిపారు. అతన్ని ఇంక్యుబేటర్లో పెట్టమని, డీర్ ఎల్-బలాహ్లోని అల్-అక్సా ఆసుపత్రికి తరలించినట్టు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- భారత జట్టు తదుపరి మ్యాచ్ల షెడ్యూల్ ఇదే..!
- బెంగళూరులో రేపటి నుంచి హోటళ్లు బంద్
- ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా దుబాయ్–వరుసగా ఆరవ సంవత్సరం గుర్తింపు
- తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..
- అమరవీరులకు కువైట్ కన్నీటి నివాళి: సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు
- లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పై విపక్షాలు అవిశ్వాస తీర్మానం
- యూఏఈలో హెలికాప్టర్ ప్రమాదం: ఇద్దరు సాయుధ దళాల సిబ్బంది మృతి
- గల్ఫ్ దేశాల్లో 12వ తరగతి పరీక్షలు వాయిదా–CBSE కీలక నిర్ణయం
- 23400 ఉల్లంఘనలు..1,200 వాహనాలు సీజ్..!!
- వీడియోలు, ఫోటోలు షేర్.. 313 మంది అరెస్టు..!!









