యూఏఈలో నిరసనలు..బంగ్లాదేశీయులు అరెస్ట్..విచారణ
- July 21, 2024
యూఏఈ: స్వదేశంలోని తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టినందుకు అరెస్టు చేసిన బంగ్లాదేశ్ జాతీయుల బృందంపై తక్షణ దర్యాప్తునకు యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూష ఆదేశించింది.వారు బహిరంగ సభ పెట్టి అశాంతిని కలిగించే ఉద్దేశ్యంతో, చట్టాలు మరియు నిబంధనల అమలును నిరోధించడం మరియు అడ్డుకోవడం, వ్యక్తులకు అంతరాయం కలిగించడం, వారి హక్కులను అడ్డుకోవడం, ట్రాఫిక్కు ఆటంకం కలిగించడం మరియు ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆస్తులకు నష్టం కలిగించడం చేసినట్టు దర్యాప్తులో వెల్లడైందని పేర్కొంది. నిరసన కరులు ఉద్దేశపూర్వకంగా రవాణాకు అంతరాయం కలిగించారని, వీడియోలను రికార్డ్ చేసి వాటిని ఆన్లైన్లో అప్లోడ్ చేశారని వెల్లడించారు. ఈ చర్యలు రాష్ట్ర భద్రత, పబ్లిక్ ఆర్డర్కు ముప్పు కలిగిస్తాయని, రాష్ట్ర ప్రయోజనాలకు హాని కలిగిస్తాయని, తదుపరి విచారణ ప్రారంభించడంతో వారిని అదుపులోకి తీసుకున్నట్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్, కౌన్సెలర్ డాక్టర్ హమద్ అల్ షమ్సీ తెలిపారు. నిందితులను త్వరితగతిన విచారణకు సూచించాలని ఆదేశించారు. దేశంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరూ దాని చట్టాలకు కట్టుబడి ఉండాలని ఆయన కోరారు.
ఇదిలా ఉండగా, బంగ్లాదేశ్ ప్రభుత్వం కోరిన సివిల్ సర్వీస్ ఉద్యోగాల కోసం ప్రిఫరెన్షియల్ హైరింగ్ నిబంధనలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జరిగిన నిరసనల్లో కనీసం 39 మంది మరణించారు.
తాజా వార్తలు
- భారత జట్టు తదుపరి మ్యాచ్ల షెడ్యూల్ ఇదే..!
- బెంగళూరులో రేపటి నుంచి హోటళ్లు బంద్
- ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా దుబాయ్–వరుసగా ఆరవ సంవత్సరం గుర్తింపు
- తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..
- అమరవీరులకు కువైట్ కన్నీటి నివాళి: సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు
- లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పై విపక్షాలు అవిశ్వాస తీర్మానం
- యూఏఈలో హెలికాప్టర్ ప్రమాదం: ఇద్దరు సాయుధ దళాల సిబ్బంది మృతి
- గల్ఫ్ దేశాల్లో 12వ తరగతి పరీక్షలు వాయిదా–CBSE కీలక నిర్ణయం
- 23400 ఉల్లంఘనలు..1,200 వాహనాలు సీజ్..!!
- వీడియోలు, ఫోటోలు షేర్.. 313 మంది అరెస్టు..!!









