యూఏఈలో నిరసనలు..బంగ్లాదేశీయులు అరెస్ట్..విచారణ
- July 21, 2024
యూఏఈ: స్వదేశంలోని తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టినందుకు అరెస్టు చేసిన బంగ్లాదేశ్ జాతీయుల బృందంపై తక్షణ దర్యాప్తునకు యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూష ఆదేశించింది.వారు బహిరంగ సభ పెట్టి అశాంతిని కలిగించే ఉద్దేశ్యంతో, చట్టాలు మరియు నిబంధనల అమలును నిరోధించడం మరియు అడ్డుకోవడం, వ్యక్తులకు అంతరాయం కలిగించడం, వారి హక్కులను అడ్డుకోవడం, ట్రాఫిక్కు ఆటంకం కలిగించడం మరియు ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆస్తులకు నష్టం కలిగించడం చేసినట్టు దర్యాప్తులో వెల్లడైందని పేర్కొంది. నిరసన కరులు ఉద్దేశపూర్వకంగా రవాణాకు అంతరాయం కలిగించారని, వీడియోలను రికార్డ్ చేసి వాటిని ఆన్లైన్లో అప్లోడ్ చేశారని వెల్లడించారు. ఈ చర్యలు రాష్ట్ర భద్రత, పబ్లిక్ ఆర్డర్కు ముప్పు కలిగిస్తాయని, రాష్ట్ర ప్రయోజనాలకు హాని కలిగిస్తాయని, తదుపరి విచారణ ప్రారంభించడంతో వారిని అదుపులోకి తీసుకున్నట్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్, కౌన్సెలర్ డాక్టర్ హమద్ అల్ షమ్సీ తెలిపారు. నిందితులను త్వరితగతిన విచారణకు సూచించాలని ఆదేశించారు. దేశంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరూ దాని చట్టాలకు కట్టుబడి ఉండాలని ఆయన కోరారు.
ఇదిలా ఉండగా, బంగ్లాదేశ్ ప్రభుత్వం కోరిన సివిల్ సర్వీస్ ఉద్యోగాల కోసం ప్రిఫరెన్షియల్ హైరింగ్ నిబంధనలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జరిగిన నిరసనల్లో కనీసం 39 మంది మరణించారు.
తాజా వార్తలు
- సౌదీ-మలేషియా జాయింట్ ఆపరేషన్.. డ్రగ్ నెట్వర్క్ బస్ట్..!!
- హవల్లీ, ముబారక్ అల్-కబీర్ ప్రాంతాల్లో పలుచోట్ల పవర్ కట్..!!
- కతారా హాస్పిటాలిటీ.. హోటళ్లు, రిసార్టుల్లో 40 శాతం వరకు ఆదా..!!
- దుబాయ్ హోటల్ ధరలకు రెక్కలు..175 శాతం వరకు పెంపు..!!
- ఒమన్ లో స్కూల్ బస్సు డ్రైవర్లకు పోలీసుల కీలక సూచనలు..!!
- బహ్రెయిన్లో మత బోధన, కార్యకలాపాలకు కొత్త నిబంధనలు..!!
- ప్రపంచ సుందరిగా జొహైరీ మోలా..
- వాట్సాప్లో అదిరిపోయే AI ఫీచర్..!
- సౌదీలో వారం రోజుల్లో 12,363 మంది నివాసితులపై బహిష్కరణ వేటు..!!
- కింగ్ ఫహద్ కాజ్వేపై బహ్రెయిన్–సౌదీ ట్యాక్సీలకు అనుమతి..!!







