భారీగా పతనమైన బంగారం ధర
- July 24, 2024
బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికీ గుడ్ న్యూస్. మంగళవారం లోక్ సభ లో ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో బంగారం , వెండిపై కస్టమ్స్ డ్యూటీని తగ్గిస్తున్నట్టు ప్రకటించారు. గోల్డ్, సిల్వర్పై 15 శాతంగా ఉన్న కస్టమ్స్ డ్యూటీని ఏకంగా 6 శాతానికి తగ్గించారు. ప్లాటినంపై కస్టమ్స్ డ్యూటీ 6.4 శాతంగా ప్రకటించారు. దీంతో ఈరోజు మార్కెట్ లో బంగారం ధర భారీగా పతనమైంది. ఒక్కసారిగా 10 గ్రాములపై రూ. 4 వేల వరకు ధర పతనం కావడంతో బంగారం కొనుగోలు చేయడానికి ఉత్సాహం ప్రదర్శించారు. 24 క్యారెట్ 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ. 70,086కు చేరుకోగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 66,495 కు తాకింది. కిలో వెండి ధర రూ. 88 వేలుకు చేరుకుంది. బంగారం ధరలు గత వారం చూసిన వారి ఆల్టైమ్ గరిష్టాల దగ్గరకు వెళ్లాయి. ఇక బడ్జెట్కు 6 రోజుల ముందు బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి.
ఇటు దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. నిన్న పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో మార్కెట్లు కుప్పకూలిన విషయం తెలిసింది. ఇవాళ ఉదయం సైతం మార్కెట్లు ఫ్లాట్గా మొదలయ్యాయి. క్రితం సెషన్తో పోలిస్తే 80,343.38 పాయింట్ల వద్ద ఫ్లాట్గా మొదలైంది. అదే సమయంలో నిఫ్టీ సైతం ఫ్లాట్గా ట్రేడవుతున్నది. ప్రారంభ ట్రేడింగ్ సెషన్లో ఐటీసీ 2శాతం పెరగ్గా.. బజాజ్ ఫైనాన్స్ షేర్లు 2శాతం బలహీనపడ్డాయి. ప్రస్తుత సెన్సెక్స్ 121 పాయింట్ల నష్టంతో 80,307 వద్ద కొనసాగుతున్నది. నిఫ్టీ 35.2 పాయింట్లు పతనమై.. 24,443.2 వద్ద ట్రేడవుతున్నది.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









