అబుదాబి - బెంగళూరు కు మరో సర్వీస్ ప్రారంభం.. ఎయిర్ ఇండియా

- July 25, 2024 , by Maagulf
అబుదాబి - బెంగళూరు కు మరో సర్వీస్ ప్రారంభం.. ఎయిర్ ఇండియా

యూఏఈ: బడ్జెట్ క్యారియర్ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ అబుదాబి - భారత నగరమైన బెంగళూరు మధ్య నేరుగా విమాన సర్వీసును ప్రారంభించింది.  200 కంటే ఎక్కువ వారపు సర్వీసులతో బెంగళూరు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌కు అతిపెద్ద స్టేషన్ గా ఉంది.

బెంగళూరు-అబుదాబి విమాన సర్వీస్ ప్రారంభించడంతో.. అయోధ్య, బాగ్‌డోగ్రా, భువనేశ్వర్, చెన్నై, గోవా, గౌహతి, గ్వాలియర్, హైదరాబాద్, ఇండోర్, జైపూర్, కోల్‌కతా, లక్నో, పూణే, రాంచీ, వారణాసి మరియు విశాఖపట్నం వంటి నగరాల నుండి భారతీయులు ఇప్పుడు యూఏఈ రాజధానికి కనెక్ట్ అయ్యే అవకాశం లభించింది.  

ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ అబుదాబిని బెంగుళూరు, కన్నూర్, కొచ్చి, కోజికోడ్, మంగళూరు, ముంబై, తిరువనంతపురం మరియు తిరుచిరాపల్లికి నేరుగా విమానాలను నడుపుతోంది. ఇది 17 భారతీయ నగరాలను అబుదాబికి వన్-స్టాప్ ప్రయాణాల ద్వారా కలుపుతుంది. గత వారం, భారతీయ తక్కువ ధర క్యారియర్ ఇండిగో వచ్చే నెల నుండి అబుదాబి నుంచి మంగళూరు, కోయంబత్తూర్ మరియు తిరుచిరాపల్లిలకు నేరుగా విమానాలను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.

ఆగస్ట్ 9 నుండి అబుదాబి నుండి మంగళూరు మార్గంలో విమానాలు ప్రతిరోజూ పనిచేస్తాయని,  తిరుచిరాపల్లి నుండి అబుదాబికి వారానికి నాలుగు సార్లు ఆగస్ట్ 11నుండి నడుస్తాయి. ఆగస్టు 10 నుంచి కోయంబత్తూర్ యూఏఈ రాజధాని మధ్య ప్రత్యక్ష విమానాలు వారానికి మూడుసార్లు నడుస్తాయని వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com