గన్నవరం ఎయిర్పోర్ట్ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి: ఎంపీ బాలశౌరి

- July 25, 2024 , by Maagulf
గన్నవరం ఎయిర్పోర్ట్ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి: ఎంపీ బాలశౌరి

న్యూ ఢిల్లీ: గన్నవరం ఎయిర్పోర్ట్ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని లోక్ సభ లో కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుని కోరిన మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి.దీని పై సానుకూలంగా స్పందించిన మంత్రి త్వరితగతిన పెండింగ్ పనులు పూర్తి చేస్తామని అన్నారు.అదేవిధంగా గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి సింగపూర్, థాయ్ లాండ్, శ్రీలంకకు విదేశాలకు వెళ్లేలా విమాన సర్వీస్లు, విజయవాడ నుంచి వారణాసి, కలకత్తా, తిరుపతికి నూతన సర్వీస్లను,ఢిల్లీ-వైజాగ్ కనెక్టివిటీ ఫ్లైట్ సర్వీసులను తీసుకురావాల్సిన అవసరం ఉందని ఎంపీ బాలశౌరి కేంద్ర మంత్రి రామ్మోహన్ ని కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com