యూపీఎస్సీ కీలక నిర్ణయం..
- July 25, 2024
న్యూ ఢిల్లీ: దేశవ్యాప్తంగా నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం సంచలనం రేకిత్తించంది. పరీక్షా నిర్వహణ విధానంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) యూపీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్ష విధానానికి సంబంధించి కీలక మార్పులకు యూపీఎస్సీ చర్యలు చేపట్టింది. ఇటీవలి ప్రభుత్వ పరీక్షలలో మోసం, కేసుల మధ్య పరీక్షా విధానాన్ని పునరుద్ధరించేందుకు అధునాతన డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని నిర్ణయించింది.
అభ్యర్థుల కోసం అత్యాధునిక ఆధార్ ఆధారిత ఫింగర్ ఫ్రింట్ అథెంటికేషన్, ఫేస్ రికగ్నైజేషన్ పొందుపరచాలని కమిషన్ యోచిస్తోంది. కృత్రిమ మేధస్సు (AI) ఉపయోగించి క్లోజ్డ్ సర్క్యూట్ టెలివిజన్ (CCTV) నిఘా, ఈ-అడ్మిట్ కార్డ్ల క్యూఆర్ కోడ్ స్కానింగ్ వంటి సాంకేతిక పరిష్కారాలతో పరీక్షల సమయంలో మోసాలను నిరోధించడానికి కూడా ప్రణాళికలను సిద్ధం చేస్తోంది.
ఏడాదికి 14 పరీక్షల నిర్వాహణ:
యూపీఎస్సీ ప్రతి ఏడాది 14 పరీక్షలను నిర్వహిస్తుంది. ఇందులో సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (CSE), అనేక రిక్రూట్మెంట్ పరీక్షలు, ఉన్నత ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలు ఉంటాయి. యూపీఎస్సీ నిర్వహించే పరీక్షల సమయంలో సాంకేతిక సేవలను అందించడానికి ప్రభుత్వ రంగ సంస్థల (PNUs) నుంచి బిడ్లను ఆహ్వానిస్తూ టెండర్ను దాఖలు చేసింది. గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో పరీక్షల ఆధారిత ప్రాజెక్ట్ల నుంచి కనీసం రూ. 100 కోట్ల సగటు వార్షిక టర్నోవర్ని కలిగిన లాభాలను ఆర్జించే సంస్థగా ఉండాలి” అని టెండర్ పేర్కొంది.
పరీక్షల నిర్వహణలో ఎన్నో లోపాలు:
పరీక్ష షెడ్యూల్, పరీక్షా వేదికల జాబితా, అభ్యర్థుల సంఖ్య పరీక్షకు రెండు మూడు వారాల ముందు ఈ సేవల ప్రదాతకి అందించడం జరుగుతుందని టెండర్ పత్రాల్లో పేర్కొన్నారు. ఇటీవల, నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET) 2024 నిర్వహణలో అనేక లోపాలు బయటపడ్డ తర్వాత సుప్రీంకోర్టు కూడా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)ని తప్పుబట్టింది.
ఇదిలా ఉండగా, సివిల్ సర్వీస్ పరీక్షకు హాజరయ్యేందుకు నిర్దేశించిన 12 ప్రయత్నాల కన్నా ఎక్కువగా సార్లు అయ్యేలా ఫేక్ డాక్యుమెంట్లను రూపొందించిన ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ వివాదంతో ఈ పరిణామం జరిగింది. ఈ క్రమంలోనే యూపీఎస్సీ ఖేద్కర్పై ఢిల్లీ పోలీసులు క్రిమినల్ కేసును నమోదు చేశారు. యూపీఎస్సీ ఎంపికను రద్దు చేయడంతో పాటు భవిష్యత్ పరీక్షల నుంచి డిబార్మెంట్ చేసేందుకు ఆమెకు షోకాజ్ నోటీసు కూడా జారీ చేసింది.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









