ఢిల్లీ కోచింగ్ సెంటర్ ఘటనలో అరెస్ట్ అయిన అధికారులు
- July 29, 2024
న్యూ ఢిల్లీ: ఢిల్లీ రాజిందర్నగర్లోని రౌస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్లోకి వరద నీరు పోటెత్తి ముగ్గురు విద్యార్థులను బలితీసుకున్న తర్వాత అధికారులు కళ్లు తెరిచారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న 13 కోచింగ్ సెంటర్లను సీజ్ చేశారు. నిన్న పలు కోచింగ్ సెంటర్లపై దాడులు నిర్వహించిన అధికారులు నిబంధనలు ఉల్లంఘించి, నిర్వహిస్తున్న కోచింగ్ సెంటర్ల భరతం పట్టారు. స్టోర్ రూమ్గా, పార్కింగ్ ఏరియాగా వాడుకోవాల్సిన సెల్లార్ను కమర్షియల్గా ఉపయోగించుకుంటున్నట్టు అధికారులు గుర్తించినట్టు ఢిల్లీ మేయర్ షెల్లీ ఒబెరాయ్ తెలిపారు. రాజిందర్నగర్లోని అన్ని కోచింగ్ సెంటర్లను సీజ్ చేసినట్టు వివరించారు. అవసరం అనుకుంటే ఢిల్లీ వ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు. రౌస్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్లోకి అకస్మాత్తుగా వరద నీరు పోటెత్తిన ఘటనలో మంచిర్యాల అమ్మాయి తానియా సోని (25)తోపాటు ఉత్తరప్రదేశ్కు చెందిన శ్రేయ యాదవ్ (25), కేరళలోని ఎర్నాకుళానికి చెందిన నవీన్ దల్వైన్ (29) ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
తాజా వార్తలు
- 2026 నూతన నాయకత్వాన్ని ఎంచుకోనున్న WTITC
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్ 2025..ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్గా కల్కి 2898AD
- వందే భారత్ విస్తరణ–నాలుగు కొత్త రైళ్లకు గ్రీన్ సిగ్నల్!
- కువైట్, ఈజిప్ట్ సంబంధాలు బలోపేతం..!!
- ఐదుగురుని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- మెడికల్ అలెర్ట్: షింగిల్స్ వ్యాక్సిన్ తో స్ట్రోక్, డిమెన్షియా దూరం..!!
- 21వ ప్రాంతీయ భద్రతా సమ్మిట్ 'మనామా డైలాగ్ 2025' ప్రారంభం..!!
- సౌదీలో 60.9 మిలియన్ల పర్యాటకులు..ఖర్చు SR161 బిలియన్లు..!!
- ‘ప్రపంచ ఉత్తమ విమానయాన సంస్థగా ఖతార్ ఎయిర్వేస్..!!
- ఏపీ: తొక్కిసలాటలో 10 మందికి పైగా దుర్మరణం







