సిరిసిల్లా కార్మికుడు సురక్షితం..త్వరలో ఇండియాకు..!
- July 30, 2024
యూఏఈ: పొట్టకూటికోసం షార్జా వచ్చి పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తి అండగా నిలిచారు ఇండియన్ అసోసియేషన్ సభ్యులు. వివరాల్లోకి వెళితే సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన ఆకెన రవి(36) పొట్ట కూటి కోసం దుబాయ్ వచ్చి తప్పిపోయారు.బాధిత కుటుంబ సభ్యులు వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయారు. స్పందించిన తెలంగాణ ప్రభుత్వం దుబాయ్ ఎంబిసి అధికారులకు లేఖ రాసింది. దుబాయిలోని సామాజిక సేవా కార్యకర్త గుండెల్లి నర్సింహులు చొరవ తీసుకొని ఎంబసీ అధికారుల సమన్వయంతో..రవి షార్జా పోలీసుల అదుపులో ఉన్నాడని తెలుసుకున్నారు. అనంతరం లీగల్ గా పోరాడి రవిని విడుదల చేయించారు.ఇండియన్ అసోసియేషన్ సభ్యుల సహాకారంతో రవిని గుండెల్లి నర్సింహులు చేరదీశారు.త్వరలోనే ఇండియా పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు.సకాలంలో స్పందించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, గుండెల్లి నర్సింహులు లకు రవి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.
తాజా వార్తలు
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ







