సిరిసిల్లా కార్మికుడు సురక్షితం..త్వరలో ఇండియాకు..!
- July 30, 2024
యూఏఈ: పొట్టకూటికోసం షార్జా వచ్చి పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తి అండగా నిలిచారు ఇండియన్ అసోసియేషన్ సభ్యులు. వివరాల్లోకి వెళితే సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన ఆకెన రవి(36) పొట్ట కూటి కోసం దుబాయ్ వచ్చి తప్పిపోయారు.బాధిత కుటుంబ సభ్యులు వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయారు. స్పందించిన తెలంగాణ ప్రభుత్వం దుబాయ్ ఎంబిసి అధికారులకు లేఖ రాసింది. దుబాయిలోని సామాజిక సేవా కార్యకర్త గుండెల్లి నర్సింహులు చొరవ తీసుకొని ఎంబసీ అధికారుల సమన్వయంతో..రవి షార్జా పోలీసుల అదుపులో ఉన్నాడని తెలుసుకున్నారు. అనంతరం లీగల్ గా పోరాడి రవిని విడుదల చేయించారు.ఇండియన్ అసోసియేషన్ సభ్యుల సహాకారంతో రవిని గుండెల్లి నర్సింహులు చేరదీశారు.త్వరలోనే ఇండియా పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు.సకాలంలో స్పందించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, గుండెల్లి నర్సింహులు లకు రవి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.
తాజా వార్తలు
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!*
- 16 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపనున్న మెటా!
- ప్రశాంతమైన రమదాన్ కోసం దుబాయ్ పోలీసుల అడుగులు
- జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవం..
- గ్లోబల్ విలేజ్లో ఈద్ బాణాసంచా వేడుకలు రద్దు..
- ఆంధ్రప్రదేశ్: నిరుద్యోగులకు శుభవార్త..
- ఆహార భద్రతా వ్యవస్థను సమీక్షించిన మినిస్టర్ టీమ్..!!
- అల్ సహ్లా రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రవాసులు మృతి..!!
- ఫేక్ బ్రాండెడ్ గూడ్స్..మనీలాండరింగ్.. Dh1-మిలియన్ ఫైన్, ఏడాది జైలు..!!
- భద్రతా పరమైన సంఘటనల వీడియోలు తీయవద్దు..!!









