సిరిసిల్లా కార్మికుడు సురక్షితం..త్వరలో ఇండియాకు..!
- July 30, 2024
యూఏఈ: పొట్టకూటికోసం షార్జా వచ్చి పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తి అండగా నిలిచారు ఇండియన్ అసోసియేషన్ సభ్యులు. వివరాల్లోకి వెళితే సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన ఆకెన రవి(36) పొట్ట కూటి కోసం దుబాయ్ వచ్చి తప్పిపోయారు.బాధిత కుటుంబ సభ్యులు వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయారు. స్పందించిన తెలంగాణ ప్రభుత్వం దుబాయ్ ఎంబిసి అధికారులకు లేఖ రాసింది. దుబాయిలోని సామాజిక సేవా కార్యకర్త గుండెల్లి నర్సింహులు చొరవ తీసుకొని ఎంబసీ అధికారుల సమన్వయంతో..రవి షార్జా పోలీసుల అదుపులో ఉన్నాడని తెలుసుకున్నారు. అనంతరం లీగల్ గా పోరాడి రవిని విడుదల చేయించారు.ఇండియన్ అసోసియేషన్ సభ్యుల సహాకారంతో రవిని గుండెల్లి నర్సింహులు చేరదీశారు.త్వరలోనే ఇండియా పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు.సకాలంలో స్పందించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, గుండెల్లి నర్సింహులు లకు రవి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.
తాజా వార్తలు
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- ఐరా ‘స్పా’ మసాజ్ సెంటర్ లో వ్యభిచారం.. నలుగురు అరెస్ట్!
- బసవతారకం హాస్పిటల్: ఏపీ వాసులకు శుభవార్త..
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్గా బి.సుమతి బాధ్యతల స్వీకరణ
- కార్పొరేట్ ట్యాక్స్ బిల్లులో లోపాలను ఎత్తిచూపిన పార్లమెంట్ ప్యానెల్..!!
- 3 గంటల రెస్క్యూ..మహిళను రక్షించిన యూఏఈ హైకర్..!!
- 2026 Q1లో సౌదీ GDP 2.8% వృద్ధి..!!
- ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై QCAA కఠిన చర్యలు..!!
- ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచిక..ఒమన్ 7 స్థానాలు మెరుగు..!!
- కువైట్ లో జూన్ 30 వరకు కార్మికుల బదిలీలు..!!









