సిరిసిల్లా కార్మికుడు సురక్షితం..త్వరలో ఇండియాకు..!
- July 30, 2024
యూఏఈ: పొట్టకూటికోసం షార్జా వచ్చి పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తి అండగా నిలిచారు ఇండియన్ అసోసియేషన్ సభ్యులు. వివరాల్లోకి వెళితే సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన ఆకెన రవి(36) పొట్ట కూటి కోసం దుబాయ్ వచ్చి తప్పిపోయారు.బాధిత కుటుంబ సభ్యులు వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయారు. స్పందించిన తెలంగాణ ప్రభుత్వం దుబాయ్ ఎంబిసి అధికారులకు లేఖ రాసింది. దుబాయిలోని సామాజిక సేవా కార్యకర్త గుండెల్లి నర్సింహులు చొరవ తీసుకొని ఎంబసీ అధికారుల సమన్వయంతో..రవి షార్జా పోలీసుల అదుపులో ఉన్నాడని తెలుసుకున్నారు. అనంతరం లీగల్ గా పోరాడి రవిని విడుదల చేయించారు.ఇండియన్ అసోసియేషన్ సభ్యుల సహాకారంతో రవిని గుండెల్లి నర్సింహులు చేరదీశారు.త్వరలోనే ఇండియా పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు.సకాలంలో స్పందించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, గుండెల్లి నర్సింహులు లకు రవి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి