పారిస్ ఒలింపిక్స్లో సింధు దూకుడు..
- July 31, 2024
పారిస్: రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు పారిస్ ఒలింపిక్స్లో అదరగొడుతోంది. వరుసగా రెండో గేమ్లోనూ విజయం సాధించింది తెలుగు తేజం. బుధవారం ఎస్తెనియా ప్లేయర్ క్రిస్టిన్ కూబాపై గెలుపొందింది.ఈ గెలుపుతో సింధు ప్రిక్వార్టర్స్(రౌండ్-16)కు దూసుకువెళ్లింది. పారిస్ ఒలింపిక్స్లో 10వ సీడ్గా ఉన్న సింధు, 73వ ర్యాంక్లో ఉన్న క్రిస్టిన్ కూబా పై 21-15, 21-10 తేడాతో విజయాన్ని అందుకుంది.
ఈ మ్యాచ్ కేవలం 34 నిమిషాల్లోనే ముగియడం గమనార్హం.సింధుకు తొలి గేమ్లో క్రిస్టిన్ ఏ మాత్రం పోరాటం ఇవ్వలేకపోయింది. అయితే..రెండో రౌండ్లో మాత్రం కాస్త ప్రతిఘటించింది. ఆదివారం అబ్దుల్ రజాక్ ఫాతిమాపై సింధు గెలిచిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







