పారిస్ ఒలింపిక్స్లో సింధు దూకుడు..
- July 31, 2024
పారిస్: రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు పారిస్ ఒలింపిక్స్లో అదరగొడుతోంది. వరుసగా రెండో గేమ్లోనూ విజయం సాధించింది తెలుగు తేజం. బుధవారం ఎస్తెనియా ప్లేయర్ క్రిస్టిన్ కూబాపై గెలుపొందింది.ఈ గెలుపుతో సింధు ప్రిక్వార్టర్స్(రౌండ్-16)కు దూసుకువెళ్లింది. పారిస్ ఒలింపిక్స్లో 10వ సీడ్గా ఉన్న సింధు, 73వ ర్యాంక్లో ఉన్న క్రిస్టిన్ కూబా పై 21-15, 21-10 తేడాతో విజయాన్ని అందుకుంది.
ఈ మ్యాచ్ కేవలం 34 నిమిషాల్లోనే ముగియడం గమనార్హం.సింధుకు తొలి గేమ్లో క్రిస్టిన్ ఏ మాత్రం పోరాటం ఇవ్వలేకపోయింది. అయితే..రెండో రౌండ్లో మాత్రం కాస్త ప్రతిఘటించింది. ఆదివారం అబ్దుల్ రజాక్ ఫాతిమాపై సింధు గెలిచిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









