ప్రైవేట్ ట్రావెల్ బస్సులో మహిళపై అఘాయిత్యం..ఇద్దరు డైవర్ల అరెస్ట్
- July 31, 2024
హైదరాబాద్: నడుస్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సులో మహిళపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితులను అరెస్ట్ చేశామని హైదరాబాద్ ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నెల్లూరుకి చెందిన ఈర్ల కృష్ణబాబు, ప్రకాశం జిల్లాకు చెందిన సిద్దయ్య అనే ఇద్దరు డ్రైవర్లను అరెస్టు చేసినట్టు చెప్పారు. కృష్ణబాబు బాధితురాలిపై అఘాయిత్యానికి పాల్పడగా, సిద్దయ్య అతడికి సహకరించాడని వెల్లడించారు. యాచారం స్టేషన్ పరిధిలో నిందితులను అరెస్టు చేశామని, వీరిపై 64 (1) BNS యాక్ట్ కింద కేసు నమోదు చేశామన్నారు.
”బాధితురాలు తన కూతురితో కలిసి హరికృష్ణ ట్రావెల్స్ బస్సు ఎక్కింది. అయితే ఒకే బెర్త్ బుక్ చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న కృష్ణబాబు.. ఆమెతో మాటలు కలిపాడు. వెనకాల ఖాళీగా ఉన్న బెర్త్ లో పడుకోవాలని ఆమెకు సూచించారు. చేగుంటలో భోజనం చేసిన తరువాత సిద్దయ్య డ్రైవ్ చేశాడు. ప్రయాణికులు అందరూ నిద్ర మత్తులో ఉన్న సమయంలో అదునుచూసి మహిళపై కృష్ణబాబు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించాం. బాధితురాలి భర్త 7 ఏళ్ల క్రితం మరణించాడ”ని డీసీపీ బాలస్వామి తెలిపారు.
కాగా, హరికృష్ణ ట్రావెల్స్ బస్సు.. నిర్మల్ నుంచి ప్రకాశం జిల్లాకు వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. తనపై కృష్ణబాబు బలవంతంగా లైంగిక దాడికి పాల్పడినట్టు బాధిత మహిళ ఆరోపించింది. అయితే బాధిత మహిళ చేసిన ఆరోపణలపై తోటి ప్రయాణికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







