న్యాయవ్యవస్థను కాపాడేందుకు కలిసికట్టుగా పనిచేద్దాం: కేటీఆర్
- August 02, 2024
హైదరాబాద్: రాజకీయంగా విబేధాలు ఉన్నప్పటికీ న్యాయ వ్యవస్థను కాపాడేందుకు సమిష్ఠిగా కలిసి పని చేయాలని మాజీ మంత్రి కేటీఆర్ ( KTR ) సూచించారు. శుక్రవారం శాసనసభలో మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశపెట్టిన సివిల్ కోర్టుల సవరణ బిల్లుపై ఆయన చర్చను ప్రారంభించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బిల్లును సమర్థిస్తూ, స్వాగతిస్తున్నట్లు తెలిపారు. రాజకీయంగా విబేధాలు ఉన్నప్పటికీ న్యాయ వ్యవస్థను కాపాడేందుకు సమిష్ఠిగా కలిసి పని చేయాలని సూచించారు. రాష్ట్రంలో సైబర్ నేరాలు, అత్యాచారాలు, హత్యలు విపరీతంగా పెరిగాయని ఆరోపించారు. ‘అత్యాచారాలు చేసిన వారికి త్వరగా శిక్షపడేలా చర్యలు తీసుకోవాలి. అత్యాచారాలు, సైబర్క్రైమ్పై ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలి. బాధితులకు త్వరగా న్యాయం జరుగుతుందనే భరోసా ఇవ్వాలి.’ అని కేటీఆర్ అన్నారు. కేంద్ర కొత్తగా తీసుకొచ్చిన చట్టాలపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరేంటో చెప్పాలని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. కేంద్రం తెచ్చిన చట్టాలతో రాష్ట్రానికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్నారు. భావవ్యక్తీకరణ స్వేచ్ఛను హరించే చట్టాలు తేవడం మంచిది కాదని చెప్పారు. కొత్త చట్టాల వల్ల తెలంగాణను పోలీసు రాజ్యంగా మారుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయన్నారు.‘ కేంద్రం తెచ్చిన కొత్త చట్టాలను కర్ణాటక, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాలు కొంత మార్పులు చేర్పులు చేశాయి. ఈ చట్టాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోవాలి’ అని కేటీఆర్ సూచించారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!
- ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది..
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..









