డయాబెటిస్ వున్నవాళ్లు గోంగూరను తినొచ్చా.!
- August 03, 2024
వర్షా కాలంలో తాజా తాజా గోంగూర టెంప్ట్ చేస్తుంటుంది. అయితే గోంగూరను షుగర్ వ్యాధిగ్రస్తులు తింటే చాలా ప్రమాదమన్న అపోహ వుంది. కానీ, అది కేవలం అపోహ మాత్రమే అంటున్నారు నిపుణులు.
గోంగూర తింటే రక్తంలోని చక్కెర స్థాయులు అదుపులో వుంటాయ్. సో, షుగర్ వ్యాధిగ్రస్తులు ఏమాత్రం అనుమానం లేకుండా గోంగూరను తినొచ్చని అంటున్నారు. అంతేకాదు, గోంగూరలోని యాంటీ ఆక్సిడెంట్లు ఇతర ఇన్ఫెక్షన్ల నుంచి శరీరాన్ని రక్షిస్తాయ్.
అలాగే, గుండె జబ్బులు దరి చేరనీయకుండా చేస్తాయ్. ఫైబర్ కంటెంట్ ఎక్కువ. సి విటమిన్ ఎక్కువగా వుంటుంది. రోజూ గోంగూరను తినే వారిలో రోగ నిరోధక శక్తి మెరుగవుతుందని చెబుతున్నారు.
అంతేకాదు, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా వుండడంలో జీర్ష సంబంధిత వ్యాధులు దరి చేరకుండా. జీర్ణ వ్యవస్థ మెరుగయ్యేందుకు తోడ్పడుతుంది.
ఎర్ర రక్త కణాల వృద్ధిలోనూ గోంగూరలోని పోషకాలు చాలా తోడ్పడతాయ్. కాల్షియం కూడా అధికంగా వుండడం వల్ల ఎముకలు, దంతాల ఆరోగ్యానికి గోంగూర సహాయం చేస్తుంది. ఇంకెందుకాలస్యం.. ఎలాంటి మొహమాటం లేకుండా నోరూరించే గోంగూరను ఇష్టమైన రీతిలో వండి కడుపారా లాగించేయండిక.
తాజా వార్తలు
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్









