వీసా క్షమాభిక్ష.. కొత్త జీవితం కోసం అక్రమ ప్రవాసుల ఎదురుచూపు..!
- August 04, 2024
యూఏఈ: నివాస వీసా ఉల్లంఘించిన వారికి యూఏఈ ప్రభుత్వం క్షమాభిక్ష కల్పిస్తుందని తెలుసుకున్న నైజీరియన్ జాతీయుడు అబు బ్యాక్ర్.. తన కుమార్తెను చూడబోతున్నట్లు ఎమోషనల్ అయ్యారు. అతను ఇంటిని విడిచిపెట్టి 2019 లో సెక్యూరిటీ గార్డుగా పని చేయడానికి దుబాయ్కి వచ్చాడు. అప్పుడు అతని కుమార్తెకు కొన్ని నెలల వయస్సు మాత్రమే. "నేను ఆమె ముఖాన్ని గుర్తుంచుకుంటూ ఉంటాను. నా జీవితంలో ప్రతిరోజు ఆమెను మిస్ అవుతున్నాను" అని 38 ఏళ్ల అబు చెప్పాడు. ఇప్పుడు అతని కుమార్తెను ఐదేళ్లుగా ప్రత్యక్షంగా చూడలేదు. అతని పేరు మీద భారీ ఓవర్స్టే జరిమానాతో, అబూ చెల్లుబాటు అయ్యే రెసిడెన్సీ లేకుండా దాదాపు మూడు సంవత్సరాలుగా యూఏఈలో చిక్కుకుపోయాడు.
కోవిడ్ బారిన పడి జీవనోపాధిని కోల్పోయిన చాలా మందిలో అబూ ఒకరు. "నా యజమాని కార్యాలయం మూసివేసారు. నా పాస్పోర్ట్ కూడా వారి వద్ద ఉంది." అని తెలిపారు. 2021 చివరి నాటికి అతని వీసా గడువు ముగిసింది. అతను తన యజమాని నుండి తన పాస్పోర్ట్ను పొందాడు. అతను కొత్త ఉద్యోగం కోసం దరఖాస్తు చేయడానికి ప్రయత్నించాడు, కానీ అదృష్టం దొరకలేదు. "నేను చట్టవిరుద్ధంగా దేశంలో ఉండిపోయాను" అని అబూ వివరించారు. సెప్టెంబరు 2022లో, అతను ఎట్టకేలకు ఉద్యోగం సాధించగలిగాడు-కాని అతని ఓవర్స్టే జరిమానాలు చెల్లించలేని విధంగా చాలా ఎక్కువగా ఉండటంతో ఇక్కడే ఉండిపోయినట్లు తెలిపారు. "అప్పటి నుండి, నాకు సాధారణ ఉద్యోగం లేదా ఇంటికి తిరిగి వెళ్లే అవకాశం ఎప్పుడూ రాలేదు." అని అతను చెప్పాడు. ఇప్పుడు, అతను దుబాయ్లో కార్ క్లీనర్గా పార్ట్టైమ్గా పనిచేస్తున్నాడు.
రెండు నెలల గ్రేస్ పీరియడ్ గురించి యూఏఈ ఇటీవల చేసిన ప్రకటన అబుకు ఆశను కలిగించింది. సెప్టెంబరు 1 నుండి ప్రభుత్వం రెసిడెన్స్ వీసా ఉల్లంఘించిన వారికి జరిమానా చెల్లించకుండా దేశం విడిచి వెళ్లడానికి లేదా వారి స్థితిని క్రమబద్ధీకరించడానికి అవకాశం కల్పిస్తుంది. "నేను చాలా సంతోషంగా ఉన్నా. త్వరలో నేను నా కూతురిని చూసి ఆమెతో ఆడుకోగలుగుతాను” అని అబు సంతోషం వ్యక్తం చేశారు.
అలాగే ఇండోనేషియాకు చెందిన లానా హబ్.. అనే 45 ఏళ్ల హౌస్కీపర్ దాదాపు ఎనిమిదేళ్లుగా యూఏఈలో ఉంటున్నారు. హౌస్మెయిడ్ వీసాపై యూఏఈకి వచ్చిన ఆమె అబుదాబిలోని ఓ కుటుంబం కోసం పనిచేసింది. దురదృష్టవశాత్తు, ఆమె యజమానులు అకస్మాత్తుగా దేశం విడిచిపెట్టారు. ఆమెకు ఉద్యోగం, గడువు ముగిసిన వీసాతో ఉండిపోయింది. డబ్బులు లేకపోవడంతో ఇంటికి వెళ్లే దారిలేక ఓవర్స్టేయర్గా మారింది. “నేను ప్రతిరోజూ భయపడ్డాను. నన్ను పట్టుకుని బహిష్కరించవచ్చని ఆలోచిస్తున్నాను. నేను పని చేసి డబ్బును నా కుటుంబానికి తిరిగి పంపాలనుకున్నాను. కానీ నా హోదాతో అది అసాధ్యం” అని లానా అన్నారు. సంవత్సరాలుగా, ఆమె ఇక్కడ బేసి ఉద్యోగాలు చేసింది. కానీ పట్టుబడుతుందనే భయం ప్రతి నిమిషం పొంచి ఉంది. "నేను గ్రేస్ పీరియడ్ గురించి విన్నప్పుడు, నాలో సంతోషం కలిగింది. " అని లానా చెప్పింది. " నేను నా స్టేటస్ని రెగ్యులరైజ్ చేయాలనుకుంటున్నాను. స్థిరమైన ఉద్యోగం పొందాలనుకుంటున్నాను. ఇది నాకు రెండో అవకాశం' అని ఆమె అన్నారు. ఇలా అనేకమంది కొత్త ఆశతో ఉన్నారు. ఆమ్నెస్టీ పథకం ప్రారంభమయ్యే సెప్టెంబర్ 1 వరకు అక్రమ నివాసితులు ఎదురుచూపులు చూస్తున్నారు. అయితే, జరిమానాలు మినహాయించబడటానికి,రెసిడెన్సీ స్థితిని క్రమబద్ధీకరించడానికి విధి విధానాలు, నిబంధనలను ఇంకా ప్రకటించలేదు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో ‘శ్రావణం 2026’ షెడ్యూల్.. ఘనంగా ఓణం వేడుకలు..!!
- మెడికల్ ఎమర్జెన్సీ.. దోహా–బెంగళూరు ఇండిగో విమానం మస్కట్కు మళ్లింపు..!!
- రెండో EU–GCC సదస్సుకు సౌదీ అరేబియా ఆతిథ్యం..!!
- ఖతార్ లో పబ్లిక్ ప్రాసిక్యూషన్–స్టేట్ ఆడిట్ బ్యూరో మధ్య కీలక ఒప్పందం..!!
- యూఏఈలో అక్టోబర్ హాఫ్టర్మ్ సెలవులు ముందుకు.. పేరెంట్స్ అసంతృప్తి..!!
- కువైట్లో డీజిల్ చోరీ.. 41 మంది అరెస్ట్..!!
- ఉద్యోగుల సోషల్ మీడియా అకౌంట్లపై కేంద్రం ఫోకస్
- President of Senegal receives Al Zeyoudi in Dakar to discuss expanding trade and investment partnership
- యువత కోసం ట్రావెల్-ఫస్ట్ డిజిటల్ కార్డు
- ఢిల్లీలో భారీ వర్షాలు..ఎయిర్పోర్ట్లో వరద నీరు







