హీరా గోల్డ్: మరో 400 కోట్లు స్వాహా
- August 05, 2024
హైదరాబాద్: తాజాగా హీరా గోల్డ్ లో ఈడీ సోదాలు ముగిసాయి. నౌ హీరా షేక్ 400 కోట్ల రూపాయల వరకు అక్రమంగా సంపాదించారని గుర్తించారు అధికారులు. రెండు రోజులపాటు ఐదు చోట్ల సోదాలు ఈడి నిర్వహించారు. అధిక మొత్తంలో వడ్డీ ఆశ చూపెట్టి వేల కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు గుర్తించారు. వివిధ స్కీముల ద్వారా పెద్ద మొత్తంలో నౌ హీరా షేక్ వసూళ్లు చేపట్టారు. పెద్ద మొత్తంలో ఆస్తుల పత్రాలను స్వాధీన పరుచుకుంది ఈడి.
38% వడ్డీ ఇస్తానంటూ భారీ వసూలుకు నౌహీరా షేక్ పాల్పడ్డాడు. ఈ దాడులలో 12 అధునాతన లగ్జరీకారులను స్వాధీన పరుచుకుంది ఈడి. అలాగే 90 లక్షల రూపాయల నగదును స్వాధీన పరుచుకుంది. నౌ హిరా షేక్ మీద 13 ఆస్తుల పత్రాలు, బినామీ పేర్ల మీద 11 ఆస్తుల పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా 45 కోట్ల రూపాయల ఆస్తుల పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే 25 కోట్ల విలువ చేసే బినామీ ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
ఇంకా యూఏఈకి పెద్ద మొత్తంలో హవాలా ద్వారా నగదు బదిలీ చేసినట్లు గుర్తించారు. విదేశాల్లోనూ పెద్ద మొత్తంలో ఆస్తులను గుర్తించ్చారు అధికారులు. అధిక వడ్డీ, బంగారం పేరు తోటి వసులోకి పాల్పడ్డాడు నౌ హీరా షేక్. గతంలోనూ నౌహీరా షేక్ ని అరెస్టు చేసారు ఈడి అధికారులు.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







