హీరా గోల్డ్: మరో 400 కోట్లు స్వాహా
- August 05, 2024
హైదరాబాద్: తాజాగా హీరా గోల్డ్ లో ఈడీ సోదాలు ముగిసాయి. నౌ హీరా షేక్ 400 కోట్ల రూపాయల వరకు అక్రమంగా సంపాదించారని గుర్తించారు అధికారులు. రెండు రోజులపాటు ఐదు చోట్ల సోదాలు ఈడి నిర్వహించారు. అధిక మొత్తంలో వడ్డీ ఆశ చూపెట్టి వేల కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు గుర్తించారు. వివిధ స్కీముల ద్వారా పెద్ద మొత్తంలో నౌ హీరా షేక్ వసూళ్లు చేపట్టారు. పెద్ద మొత్తంలో ఆస్తుల పత్రాలను స్వాధీన పరుచుకుంది ఈడి.
38% వడ్డీ ఇస్తానంటూ భారీ వసూలుకు నౌహీరా షేక్ పాల్పడ్డాడు. ఈ దాడులలో 12 అధునాతన లగ్జరీకారులను స్వాధీన పరుచుకుంది ఈడి. అలాగే 90 లక్షల రూపాయల నగదును స్వాధీన పరుచుకుంది. నౌ హిరా షేక్ మీద 13 ఆస్తుల పత్రాలు, బినామీ పేర్ల మీద 11 ఆస్తుల పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా 45 కోట్ల రూపాయల ఆస్తుల పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే 25 కోట్ల విలువ చేసే బినామీ ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
ఇంకా యూఏఈకి పెద్ద మొత్తంలో హవాలా ద్వారా నగదు బదిలీ చేసినట్లు గుర్తించారు. విదేశాల్లోనూ పెద్ద మొత్తంలో ఆస్తులను గుర్తించ్చారు అధికారులు. అధిక వడ్డీ, బంగారం పేరు తోటి వసులోకి పాల్పడ్డాడు నౌ హీరా షేక్. గతంలోనూ నౌహీరా షేక్ ని అరెస్టు చేసారు ఈడి అధికారులు.
తాజా వార్తలు
- షార్లెట్లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!









