హీరా గోల్డ్: మరో 400 కోట్లు స్వాహా
- August 05, 2024
హైదరాబాద్: తాజాగా హీరా గోల్డ్ లో ఈడీ సోదాలు ముగిసాయి. నౌ హీరా షేక్ 400 కోట్ల రూపాయల వరకు అక్రమంగా సంపాదించారని గుర్తించారు అధికారులు. రెండు రోజులపాటు ఐదు చోట్ల సోదాలు ఈడి నిర్వహించారు. అధిక మొత్తంలో వడ్డీ ఆశ చూపెట్టి వేల కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు గుర్తించారు. వివిధ స్కీముల ద్వారా పెద్ద మొత్తంలో నౌ హీరా షేక్ వసూళ్లు చేపట్టారు. పెద్ద మొత్తంలో ఆస్తుల పత్రాలను స్వాధీన పరుచుకుంది ఈడి.
38% వడ్డీ ఇస్తానంటూ భారీ వసూలుకు నౌహీరా షేక్ పాల్పడ్డాడు. ఈ దాడులలో 12 అధునాతన లగ్జరీకారులను స్వాధీన పరుచుకుంది ఈడి. అలాగే 90 లక్షల రూపాయల నగదును స్వాధీన పరుచుకుంది. నౌ హిరా షేక్ మీద 13 ఆస్తుల పత్రాలు, బినామీ పేర్ల మీద 11 ఆస్తుల పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా 45 కోట్ల రూపాయల ఆస్తుల పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే 25 కోట్ల విలువ చేసే బినామీ ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
ఇంకా యూఏఈకి పెద్ద మొత్తంలో హవాలా ద్వారా నగదు బదిలీ చేసినట్లు గుర్తించారు. విదేశాల్లోనూ పెద్ద మొత్తంలో ఆస్తులను గుర్తించ్చారు అధికారులు. అధిక వడ్డీ, బంగారం పేరు తోటి వసులోకి పాల్పడ్డాడు నౌ హీరా షేక్. గతంలోనూ నౌహీరా షేక్ ని అరెస్టు చేసారు ఈడి అధికారులు.
తాజా వార్తలు
- 23 మంది అక్రమ చోరబాటుకు సహకారం..ఇద్దరి అరెస్టు..!!
- IPL 2026: పంజాబ్ కింగ్స్ జైత్రయాత్రకు బ్రేక్..
- లొంగిపోయిన మావోలకు ఉద్యోగాలు…తెలంగాణ కీలక నిర్ణయం
- విశాఖపట్నంలోని ఫ్యాషన్ ప్రియులకు శుభవార్త
- చమురు కూటమికి యూఏఈ గుడ్ బై..!
- హర్మూజ్ను తెరవడానికి ఇరాన్ మూడు షరతులు
- పెరిగిన ధరలతో విమానాలు నడపడం కష్టం..కేంద్రానికి విమాన సంస్థల లేఖ
- శ్రీవారి భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం..
- తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్..ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం...
- కార్మికుల బదిలీకి యజమాని ఆమోదం తప్పనిసరి..!!









