క్వార్టర్ ఫైనల్కు భారత మహిళల టేబుల్ టెన్నిస్ జట్టు..
- August 05, 2024
పారిస్: పారిస్ ఒలింపిక్స్ లో భారత మహిళల టేబుల్ టెన్నిస్ జట్టు రొమేనియాను ఓడించి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. 16వ రౌండ్ లో రొమానియాను 3-2 తేడాతో ఓడించింది.
ఒలింపిక్స్ TTలో భారత్ ఉమెన్స్ జట్టు క్వార్టర్స్ చేరుకోవడం ఇదే తొలిసారి. ఈ ఈవెంట్లో శ్రీజ, అర్చన, మణిక బృందం అద్భుత ప్రదర్శన చేసి రొమేనియాను ఓడించారు. ఈ ఉత్కంఠ పోరులో ప్రపంచ 11వ ర్యాంకర్ టీమిండియా 3-2తో నాలుగో నంబర్ టీమ్ రొమేనియాపై విజయం సాధించింది. క్వార్టర్ ఫైనల్స్ లో భారత్ జట్టు అమెరికా లేదా జర్మనీతో పోటీ పడే అవకాశం ఉంది.
ఈ మ్యాచ్లో శ్రీజ, అర్చన జోడీ తొలుత డబుల్స్లో అడుగుపెట్టింది. తొలి మ్యాచ్లో ఈ భారత జోడీ రొమేనియాకు చెందిన ఎడినా, సమారా జోడీని 3-0తో ఓడించి ముందంజ వేసింది. ఈ భారత జోడీ 11-9, 12-10, 11-7 తేడాతో ఎడినా, సమారాపై విజయం సాధించింది. ఆ తర్వాత.. మణిక తదుపరి మ్యాచ్లోకి ప్రవేశించింది. ఆ మ్యాచ్ లో బెర్నాడెట్ను 3-0తో సులభంగా ఓడించింది. మణికా 11-5, 11-7, 11-7 తేడాతో బెర్నాడెట్ను ఓడించింది. దీంతో భారత జట్టు రొమేనియాపై 2-0 ఆధిక్యంలో నిలిచింది.
తొలి రెండు మ్యాచ్లు గెలిచి 2-0తో ఆధిక్యంలో ఉన్న భారత జట్టు మూడో మ్యాచ్లో వెనుదిరిగింది. ఎలిజబెత్ సమారాతో జరిగిన ఉత్కంఠ సింగిల్స్ మ్యాచ్లో శ్రీజ ఆకుల ఓడిపోయింది. ఈ మ్యాచ్లో సమర 3-2తో శ్రీజను ఓడించింది. శ్రీజ, సమర మధ్య జరిగిన మ్యాచ్ లో 8-11, 11-4, 7-11, 11-6, 11-8 తేడాతో సమర గెలిచింది. ఈ మ్యాచ్లో శ్రీజ ఓడిపోయినప్పటికీ, రొమేనియాపై భారత్ 2-1 ఆధిక్యంలో ఉంది. ఆ తర్వాత.. బెర్నాడెట్తో జరిగిన నాలుగో మ్యాచ్లో అర్చన కామత్ 3-1 తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఈ మ్యాచ్లో అర్చన 5-11, 11-8, 7-11, 9-11 తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. దీంతో.. భారత్, రొమేనియా మధ్య స్కోరు 2-2తో సమమైంది. కాగా.. చివరి మ్యాచ్లో మ్యాచ్ ఫలితం డిసైడ్ అయింది. ఈ మ్యాచ్లో మనిక 3-0 (11-5, 11-9, 11-9)తో ఎడినా డియాకానును ఓడించింది.
తాజా వార్తలు
- క్షతగాత్రులను పరామర్శించిన యుఏఈ అధ్యక్షుడు
- దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు: వదంతులను కొట్టిపారేసిన అధికారులు!
- అనుమతి లేకుండా ధరలు మారిస్తే.. QR1,000,000 ఫైన్..!!
- డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యవసర హెచ్చరిక వస్తే?
- ఇరాన్ దురాక్రమణ..బహ్రెయిన్కు నాటో మద్దతు..!!
- గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు నేపథ్యంలో TGWWC–ఒమాన్ శాఖ అత్యవసర సమావేశం
- నేషనల్ వాటర్ కంట్రోల్ సెంట్రల్ ను సందర్శించిన పీఎం..!!
- ఆఫ్రికన్, మధ్య ఆసియా దేశాలతో ఒమన్ చర్చలు..!!
- రియాద్, జెడ్డా నుండి దుబాయ్ కు ఫ్లైట్స్ పునరుద్ధరణ..!!
- దుబాయ్ లో పబ్లిక్ సేఫ్టీపై కొత్త చట్టం..Dh2 మిలియన్ల ఫైన్..!!









