దుబాయ్ డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న షార్జా నివాసి
- August 08, 2024
యూఏఈ: బుధవారం దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని కాంకోర్స్ సిలో జరిగిన తాజా దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ అండ్ ఫైనెస్ట్ సర్ప్రైజ్ డ్రాలో కెనడియన్ జాతీయుడిని మిలియనీర్గా ప్రకటించారు. షార్జాలో ఉన్న కెనడియన్ హిషామ్ అల్షెల్, మిలీనియం మిలియనీర్ సిరీస్ 470లో టికెట్ నంబర్ 4481తో $1 మిలియన్ విజేతగా నిలిచాడు. అతను జూలై 24న టర్కీలోని ఇస్తాంబుల్కి వెళ్లేటప్పుడు కొనుగోలు చేశాడు. 199 నుండి మిలీనియం మిల్లియనీర్ ప్రమోషన్ను గెలుచుకున్న 10వ కెనడియన్ జాతీయురాలు అయిన అల్షెల్హ్ ప్రస్తుతం ఇంకా అందుబాటులోకి రాలేదని నిర్వాహకులు తెలిపారు.
ప్రియా సోమీ.. దుబాయ్లో ఉన్న 35 ఏళ్ల భారతీయ జాతీయురాలు. ఆమె జూలై 18న న్యూఢిల్లీకి వెళ్లే మార్గంలో కొనుగోలు చేసిన ఫైనెస్ట్ సర్ప్రైజ్ సిరీస్ 1887లో టికెట్ నంబర్ 0533తో రేంజ్ రోవర్ స్పోర్ట్ డైనమిక్ HSE P400 (శాంటోరిని బ్లాక్) కారును గెలుచుకుంది. దుబాయ్ డ్యూటీ ఫ్రీ ప్రమోషన్లో రెగ్యులర్ పార్టిసిపెంట్. సోమీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. "నేను ప్రస్తుతం నమ్మలేకపోతున్నాను. కానీ దుబాయ్ డ్యూటీ ఫ్రీకి చాలా ధన్యవాదాలు." అని ఆమె హర్షం వ్యక్తం చేసింది.
తాజా వార్తలు
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- IPL 2026: ముంబై పై హైదరాబాద్ ఘన విజయం
- యూరప్ పర్యటనలో యూఏఈలో ప్రధాని మోదీ స్టాప్ఓవర్ చేసే అవకాశం
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- ఇనార్బిట్ మాల్ లో ‘మైఖేల్’ చిత్ర ప్రత్యేక ప్రదర్శన
- 1000 కోట్ల నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం!
- ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు..అధికారం ఆ పార్టీలదే...పీపుల్స్ పల్స్ సంచలన ఎగ్జిట్ పోల్స్
- రోడ్డు దాటుతుండగా వాహనం ఢీ..దుబాయ్ పోలీసుల హెచ్చరిక జారీ..!!
- FIFA U-17 ప్రపంచ కప్ ఖతార్ 2026 టోర్నమెంట్ తేదీల ప్రకటన..!!
- 6,640 విద్యుత్ కనెక్షన్ల తొలగింపు..సమీక్షకు ఎంపీ పిలుపు..!!









