దుబాయ్ డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న షార్జా నివాసి
- August 08, 2024
యూఏఈ: బుధవారం దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని కాంకోర్స్ సిలో జరిగిన తాజా దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ అండ్ ఫైనెస్ట్ సర్ప్రైజ్ డ్రాలో కెనడియన్ జాతీయుడిని మిలియనీర్గా ప్రకటించారు. షార్జాలో ఉన్న కెనడియన్ హిషామ్ అల్షెల్, మిలీనియం మిలియనీర్ సిరీస్ 470లో టికెట్ నంబర్ 4481తో $1 మిలియన్ విజేతగా నిలిచాడు. అతను జూలై 24న టర్కీలోని ఇస్తాంబుల్కి వెళ్లేటప్పుడు కొనుగోలు చేశాడు. 199 నుండి మిలీనియం మిల్లియనీర్ ప్రమోషన్ను గెలుచుకున్న 10వ కెనడియన్ జాతీయురాలు అయిన అల్షెల్హ్ ప్రస్తుతం ఇంకా అందుబాటులోకి రాలేదని నిర్వాహకులు తెలిపారు.
ప్రియా సోమీ.. దుబాయ్లో ఉన్న 35 ఏళ్ల భారతీయ జాతీయురాలు. ఆమె జూలై 18న న్యూఢిల్లీకి వెళ్లే మార్గంలో కొనుగోలు చేసిన ఫైనెస్ట్ సర్ప్రైజ్ సిరీస్ 1887లో టికెట్ నంబర్ 0533తో రేంజ్ రోవర్ స్పోర్ట్ డైనమిక్ HSE P400 (శాంటోరిని బ్లాక్) కారును గెలుచుకుంది. దుబాయ్ డ్యూటీ ఫ్రీ ప్రమోషన్లో రెగ్యులర్ పార్టిసిపెంట్. సోమీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. "నేను ప్రస్తుతం నమ్మలేకపోతున్నాను. కానీ దుబాయ్ డ్యూటీ ఫ్రీకి చాలా ధన్యవాదాలు." అని ఆమె హర్షం వ్యక్తం చేసింది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధి పై సుంకాలు ఉండవు..అమెరికాకు తెలిపిన ఇరాన్
- సైబర్ నేరాల నియంత్రణ పై ప్రధాని మోదీ ప్రత్యేక దృష్టి
- కువైట్లో పశువుల షెడ్డులో ఘర్షణ.. ముగ్గురికి గాయాలు, ముగ్గురు అరెస్ట్
- వెనెజువెలాలో భూకంప భీభత్సం..
- భారత క్రికెట్ చరిత్రను మార్చిన రోజు
- క్రెడిట్ కార్డు యూజర్లకు RBI గుడ్ న్యూస్
- సమ్మర్ లో ప్రభుత్వ ఉద్యోగులకు ఫ్లెక్సిబుల్ టైమింగ్స్: దుబాయ్
- జెడ్డాలో 12 లైసెన్సు లేని వాటర్ బాట్లింగ్ ప్లాంట్లు సీజ్..!!
- యూఏఈ లాటరీ: Dh100,000 బహుమతి గెలిచిన ముగ్గురు విజేతలు..!!
- ముగిసిన సంక్షోభం..భారీగా ఖర్చు పెడుతున్న కువైట్ కన్జుమర్స్..!!







