నోటిలొ పుండ్లు-ఈ చిట్కాలు పాటిస్తే ఉపశమనం.!
- August 09, 2024
విటమిన్ బి, సి లోపించడం కారణంగా నోటిలో పుండ్లు వస్తుంటాయ్. ఇవి కొందరికి రెండు నుంచి మూడు రోజుల్లోనే నయమైపోతుంటాయ్. ఇంకొందరిలో వారం రోజుల వరకూ ఇబ్బంది పెడుతుంటాయ్.
ఏమీ తిననివ్వవు. మాట్లాడనివ్వవు. చుక్కలు చూపిస్తుంటాయ్. మరి, వీటి నుంచి ఉపశమనం పొందడమెలా.? వైద్యుని సంప్రదిస్తే విటమిన్ ట్యాబ్లెట్లు ప్రిఫర్ చేస్తారు. కానీ, రెండు మూడు రోజులు మాత్రం వీటితో ఇబ్బంది పడాల్సిందే.
అయితే, ట్యాబ్లెట్ల జోలికి పోయే అవసరం లేకుండా ఇంట్లోనే చిన్న చిన్న రెమిడీస్ పాటిస్తే కాస్త ఉపశమనం పొందే అవకాశాలున్నాయ్. కొద్దిగా గోరు వెచ్చని నీటిలో కాస్త కళ్లు ఉప్పు (రాక్ సాల్ట్) వేసి పుక్కిలిస్తే ఉపశమనం వుంటుంది. రోజులో మూడు సార్లయినా ఇలా చేయాల్సి వుంటుంది.
చిటికెడు పసుపును తీసుకుని ముద్దగా చేసి పుండుపై పెట్టినా ఉపశమనం వుంటుంది. అలాగే బేకింగ్ సోడా కలిపిన వాటర్ పుక్కిలించినా ఫలితం వుంటుంది.
కాస్త తేనె తీసుకుని పుండుపై ఆరారగా పెడుతూ వుంటే పుండు తొందరగా మానుతుంది. అన్నింటికీ మించి ఈ సమస్య మళ్లీ మళ్లీ రాకుండా వుండాలంటే వాటర్ ఎక్కువగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







