నోటిలొ పుండ్లు-ఈ చిట్కాలు పాటిస్తే ఉపశమనం.!
- August 09, 2024
విటమిన్ బి, సి లోపించడం కారణంగా నోటిలో పుండ్లు వస్తుంటాయ్. ఇవి కొందరికి రెండు నుంచి మూడు రోజుల్లోనే నయమైపోతుంటాయ్. ఇంకొందరిలో వారం రోజుల వరకూ ఇబ్బంది పెడుతుంటాయ్.
ఏమీ తిననివ్వవు. మాట్లాడనివ్వవు. చుక్కలు చూపిస్తుంటాయ్. మరి, వీటి నుంచి ఉపశమనం పొందడమెలా.? వైద్యుని సంప్రదిస్తే విటమిన్ ట్యాబ్లెట్లు ప్రిఫర్ చేస్తారు. కానీ, రెండు మూడు రోజులు మాత్రం వీటితో ఇబ్బంది పడాల్సిందే.
అయితే, ట్యాబ్లెట్ల జోలికి పోయే అవసరం లేకుండా ఇంట్లోనే చిన్న చిన్న రెమిడీస్ పాటిస్తే కాస్త ఉపశమనం పొందే అవకాశాలున్నాయ్. కొద్దిగా గోరు వెచ్చని నీటిలో కాస్త కళ్లు ఉప్పు (రాక్ సాల్ట్) వేసి పుక్కిలిస్తే ఉపశమనం వుంటుంది. రోజులో మూడు సార్లయినా ఇలా చేయాల్సి వుంటుంది.
చిటికెడు పసుపును తీసుకుని ముద్దగా చేసి పుండుపై పెట్టినా ఉపశమనం వుంటుంది. అలాగే బేకింగ్ సోడా కలిపిన వాటర్ పుక్కిలించినా ఫలితం వుంటుంది.
కాస్త తేనె తీసుకుని పుండుపై ఆరారగా పెడుతూ వుంటే పుండు తొందరగా మానుతుంది. అన్నింటికీ మించి ఈ సమస్య మళ్లీ మళ్లీ రాకుండా వుండాలంటే వాటర్ ఎక్కువగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







