నోటిలొ పుండ్లు-ఈ చిట్కాలు పాటిస్తే ఉపశమనం.!
- August 09, 2024
విటమిన్ బి, సి లోపించడం కారణంగా నోటిలో పుండ్లు వస్తుంటాయ్. ఇవి కొందరికి రెండు నుంచి మూడు రోజుల్లోనే నయమైపోతుంటాయ్. ఇంకొందరిలో వారం రోజుల వరకూ ఇబ్బంది పెడుతుంటాయ్.
ఏమీ తిననివ్వవు. మాట్లాడనివ్వవు. చుక్కలు చూపిస్తుంటాయ్. మరి, వీటి నుంచి ఉపశమనం పొందడమెలా.? వైద్యుని సంప్రదిస్తే విటమిన్ ట్యాబ్లెట్లు ప్రిఫర్ చేస్తారు. కానీ, రెండు మూడు రోజులు మాత్రం వీటితో ఇబ్బంది పడాల్సిందే.
అయితే, ట్యాబ్లెట్ల జోలికి పోయే అవసరం లేకుండా ఇంట్లోనే చిన్న చిన్న రెమిడీస్ పాటిస్తే కాస్త ఉపశమనం పొందే అవకాశాలున్నాయ్. కొద్దిగా గోరు వెచ్చని నీటిలో కాస్త కళ్లు ఉప్పు (రాక్ సాల్ట్) వేసి పుక్కిలిస్తే ఉపశమనం వుంటుంది. రోజులో మూడు సార్లయినా ఇలా చేయాల్సి వుంటుంది.
చిటికెడు పసుపును తీసుకుని ముద్దగా చేసి పుండుపై పెట్టినా ఉపశమనం వుంటుంది. అలాగే బేకింగ్ సోడా కలిపిన వాటర్ పుక్కిలించినా ఫలితం వుంటుంది.
కాస్త తేనె తీసుకుని పుండుపై ఆరారగా పెడుతూ వుంటే పుండు తొందరగా మానుతుంది. అన్నింటికీ మించి ఈ సమస్య మళ్లీ మళ్లీ రాకుండా వుండాలంటే వాటర్ ఎక్కువగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు
- IPL మినీ ఆక్షన్లో కొత్త రూల్...
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..
- కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు..
- 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా: కవిత
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!







