నోటిలొ పుండ్లు-ఈ చిట్కాలు పాటిస్తే ఉపశమనం.!
- August 09, 2024
విటమిన్ బి, సి లోపించడం కారణంగా నోటిలో పుండ్లు వస్తుంటాయ్. ఇవి కొందరికి రెండు నుంచి మూడు రోజుల్లోనే నయమైపోతుంటాయ్. ఇంకొందరిలో వారం రోజుల వరకూ ఇబ్బంది పెడుతుంటాయ్.
ఏమీ తిననివ్వవు. మాట్లాడనివ్వవు. చుక్కలు చూపిస్తుంటాయ్. మరి, వీటి నుంచి ఉపశమనం పొందడమెలా.? వైద్యుని సంప్రదిస్తే విటమిన్ ట్యాబ్లెట్లు ప్రిఫర్ చేస్తారు. కానీ, రెండు మూడు రోజులు మాత్రం వీటితో ఇబ్బంది పడాల్సిందే.
అయితే, ట్యాబ్లెట్ల జోలికి పోయే అవసరం లేకుండా ఇంట్లోనే చిన్న చిన్న రెమిడీస్ పాటిస్తే కాస్త ఉపశమనం పొందే అవకాశాలున్నాయ్. కొద్దిగా గోరు వెచ్చని నీటిలో కాస్త కళ్లు ఉప్పు (రాక్ సాల్ట్) వేసి పుక్కిలిస్తే ఉపశమనం వుంటుంది. రోజులో మూడు సార్లయినా ఇలా చేయాల్సి వుంటుంది.
చిటికెడు పసుపును తీసుకుని ముద్దగా చేసి పుండుపై పెట్టినా ఉపశమనం వుంటుంది. అలాగే బేకింగ్ సోడా కలిపిన వాటర్ పుక్కిలించినా ఫలితం వుంటుంది.
కాస్త తేనె తీసుకుని పుండుపై ఆరారగా పెడుతూ వుంటే పుండు తొందరగా మానుతుంది. అన్నింటికీ మించి ఈ సమస్య మళ్లీ మళ్లీ రాకుండా వుండాలంటే వాటర్ ఎక్కువగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్









