ఢిల్లీ ఉగ్ర కుట్ర భగ్నం...వాంటెడ్ టెర్రరిస్ట్ను పట్టుకున్న పోలీసులు
- August 09, 2024
న్యూ ఢిల్లీ: స్వాతంత్ర్య వేడుకల వేళ ఢిల్లీలో భారీ ఉగ్ర కుట్రను పోలీసులు భగ్నం చేశారు. పరారీలో ఉన్నఐసిస్ ఉగ్రవాదిని పట్టుకున్నారు. అతడి నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీలోని దర్యాగంజ్ నివాసి అయిన రిజ్వాన్ అబ్దుల్ హజీ అలీ ఐసిస్ పుణె మాడ్యూల్లో కీలక సభ్యుడిగా వ్యవహరిస్తున్నాడు. అతడిపై ఇప్పటికే ఎన్ఐఏ రూ.3లక్షల రివార్డ్ కూడా ప్రకటించింది. గురువారం రాత్రి 11 గంటలకు తుగ్లకాబాద్లోని బయోడైవర్సిటీ పార్క్ వద్దకు రిజ్వాన్ అలీ వస్తాడని పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో అత్యంత చాకచక్యంగా అతడిని ట్రాప్ చేసి పట్టుకున్నారు. అలీ నుంచి పిస్టోల్, ఇతర ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. రెండు మొబైల్ ఫోన్లను సీజ్ చేసి.. వాటిల్లోని డేటాను సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. స్వాతంత్ర్య వేడుకల వేళ ఢిల్లీకి అతడు రావడం కలకలం రేపింది. ఇప్పటికే ఢిల్లీలోని పలు వీఐపీ ప్రాంతాల్లో రిజ్వాన్, అతడి అనుచరులు పలుమార్లు రెక్కీ చేసినట్లు పోలీసువర్గాలు వెల్లడించాయి. పంద్రాగస్టు వేళ వీరు ఉగ్రదాడులకు కుట్రలు పన్నినట్లు అనుమానిస్తున్నారు. ఈ అరెస్టు నేపథ్యంలో ఢిల్లీవ్యాప్తంగా భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







