'హెచ్‌టీటీ-40' గగన విహారం

- June 16, 2016 , by Maagulf
'హెచ్‌టీటీ-40' గగన విహారం

వాయుసేన ఆధ్వర్యంలో సైనిక శిక్షణ కోసం తొలిసారిగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన యుద్ధవిమానం 'హిందూస్థాన్‌ టర్బో ట్రైనర్‌-40(హెచ్‌టీటీ-40)' శుక్రవారం లాంఛనంగా గగన విహారం చేయనుంది. రక్షణ మంత్రి మనోహర్‌ పర్రీకర్‌ సమక్షంలో బెంగళూరులోని హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌(హెచ్‌ఏఎల్‌) విమానాశ్రయం నుంచి ఉదయం 9:15 గంటలకు హెచ్‌టీటీ గాలిలోకి ఎగరింది.
భారత వాయుసేనలో సైనిక శిక్షణ నిమిత్తం 2,800 కిలోల బరువైన ఈ యుద్ధవిమానాన్ని హెచ్‌ఏఎల్‌ డిజైన్ చేసింది. మొత్తం 70 హెచ్‌టీటీలను వాయుసేనకు అందజేయనుంది. ఈ విమానం తయారీ ప్రక్రియ 2012లో ప్రారంభం కాగా, తొలిసారిగా మే 31న గాలిలోకి ఎగిరింది. 2018 నాటికి ఇది పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. సైనిక శిక్షణకు ఉపయోగిస్తున్న 38 'హెచపీటీ-32 దీపక్‌' విమానాల స్థానంలో వీటిని ప్రవేశపెట్టనున్నారు. ఒక్కో విమానానికయ్యే ఖర్చు దాదాపు 34.5 కోట్లు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com