దొంగతనం అడ్డుకున్నందుకు దారుణంగా చంపేసిన ఘటన..
- June 16, 2016
దొంగతనం చేయడానికి వచ్చిన దుండగులను అడ్డుకున్నందుకు ఒమన్లో ఓ భారతీయుడిని దారుణంగా చంపేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..
కేరళకు చెందిన జాన్ ఫిలిప్ 13ఏళ్ల క్రితం ఒమన్ వెళ్లారు. అక్కడ ఓ పెట్రోల్ బంక్లో పనిచేస్తున్నాడు. గత వారం రోజులుగా ఫిలిప్ కనిపించకపోవడంతో సహ ఉద్యోగి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు గాలింపు చేపట్టగా.. రాయల్ ఒమన్ స్టేషన్ పరిధిలో రక్తపుమడుగులో ఉన్న ఫిలిప్ మృతదేహాన్ని గుర్తించారు. .
దీంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఫిలిప్ పనిచేసే పెట్రోల్బంక్లో రూ.6.5లక్షల నగదు చోరీ జరిగిందని.. చోరీని అడ్డుకునే క్రమంలోనే దుండగులు హత్య చేశారని పోలీసుల విచారణలో తేలింది. ఘటనకు కారణమైన ఆరుగురు దుండగులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







