అన్న క్యాంటీన్లో వారం రోజుల ఫుడ్ మెనూ..
- August 14, 2024
అమరావతి: ఏపీలో వేర్వేరు చోట్ల అన్నా క్యాంటిన్లు ఆగస్టు 15 నుంచి ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే. ఎన్నికల హామీ మేరకు కూటమి ప్రభుత్వం అన్నా క్యాంటీన్ల ఏర్పాటుకు అన్ని రెడీ చేసింది. తొలి విడతగా రాష్ట్ర వ్యాప్తంగా 100 అన్నా క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. 15న చంద్రబాబు కృష్ణా జిల్లాలోని గుడివాడ పట్టణంలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ను ప్రారంభించనున్నారు.
అయితే, అన్నా క్యాంటిన్ లో ప్రజలకు వడ్డించే ఆహారానికి సంబంధించి మెనూ సిద్ధమైంది. ఉదయం అల్పాహారంలో భాగంగా సోమవారం ఇడ్లీతో పాటు చట్నీ లేదా పొడి లేదా సాంబార్ అందించనున్నారు. లేదా పూరీ, కుర్మా ఉండనుంది. మంగళవారం ఇడ్లీతో పాటు చట్నీ లేదా పొడి లేదా సాంబార్ కానీ, లేదా ఉప్మాతో చట్నీ, పొడి, సాంబార్, మిక్చర్ వడ్డించనున్నారు. బుధవారం ఇడ్లీతో పాటు చట్నీ లేదా పొడి లేదా సాంబార్ లేదా పొంగల్తో చట్నీ లేదా పొడి లేదా సాంబార్ ఉండనుంది. గురువారం ఇడ్లీతో పాటు చట్నీ లేదా పొడి లేదా సాంబార్ లేదా పూరీ కుర్మా… శుక్రవారం ఇడ్లీతో పాటు చట్నీ లేదా పొడి లేదా సాంబార్ లేదా ఉప్మాతో చట్నీ లేదా పొడి లేదా సాంబార్.. శనివారం ఇడ్లీతో పాటు చట్నీ లేదా పొడి లేదా సాంబార్ లేదా పొంగల్తో చట్నీ లేదా పొడి లేదా సాంబార్ వడ్డించనున్నారు.
మధ్యాహ్న భోజనం లేదా రాత్రివేళ భోజనంలో భాగంగా వైట్ రైస్, కూర, పప్పు లేదా సాంబార్, పెరుగు, పచ్చడి వడ్డించనున్నారు. వారంలో ఏడు రోజులు మెను ఇలాగే ఉండనుంది. కానీ, కూర మాత్రం రోజుకో రకంగా ఉండనుంది.
బ్రేక్ ఫాస్ట్లో ఇడ్లీ, పూరీ అయితే, ఒక్కొక్కరికి 3 చొప్పున వడ్డించనున్నారు. ఉప్మా, పొంగల్ 250 గ్రాములు వడ్డిస్తారు. వైట్ రైస్ 400 గ్రాములు, చట్నీ లేదా పొడి 15 గ్రాములు, సాంబార్ 150 గ్రాములు, మిక్చర్ 25 గ్రాములు, కూర 100 గ్రాములు, పప్పు లేదా సాంబార్ 120 గ్రాములు, పచ్చడి 15 గ్రాములు, పెరుగు 75 గ్రాములు వడ్డించనున్నారు. బ్రేక్ ఫాస్ట్ ఉదయం 7.30 నుంచి 10 గంటల మధ్య ఉండనుంది. మధ్యాహ్న భోజనం 12.30 నుంచి 3 గంటల మధ్యలో ఏర్పాటు చేస్తున్నారు. రాత్రి భోజనం 7.30 నుంచి 9 గంటల మధ్య ఉంటుంది. ఆదివారం అన్నా క్యాంటిన్ కు సెలవు ఉంటుంది. అలాగే వారానికి ఒకరోజు స్పెషల్ రైస్ వడ్డిస్తారు.
ఈ మేరకు సీఎం చంద్రబాబు షెడ్యూల్ ఖరారైనట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తొలుత విశాఖ జిల్లాలో అన్నా క్యాంటీన్ను ప్రారంభించాలని సీఎం చంద్రబాబు భావించారు. అయితే, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన కోడ్ ఉండడంతో కార్యక్రమం వాయిదా పడింది. దీంతో కృష్ణా జిల్లాలోని గుడివాడ పట్టణంలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ను ప్రారంభించడం ద్వారా ఈ పథకాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







