అన్న క్యాంటీన్లో వారం రోజుల ఫుడ్ మెనూ..
- August 14, 2024
అమరావతి: ఏపీలో వేర్వేరు చోట్ల అన్నా క్యాంటిన్లు ఆగస్టు 15 నుంచి ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే. ఎన్నికల హామీ మేరకు కూటమి ప్రభుత్వం అన్నా క్యాంటీన్ల ఏర్పాటుకు అన్ని రెడీ చేసింది. తొలి విడతగా రాష్ట్ర వ్యాప్తంగా 100 అన్నా క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. 15న చంద్రబాబు కృష్ణా జిల్లాలోని గుడివాడ పట్టణంలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ను ప్రారంభించనున్నారు.
అయితే, అన్నా క్యాంటిన్ లో ప్రజలకు వడ్డించే ఆహారానికి సంబంధించి మెనూ సిద్ధమైంది. ఉదయం అల్పాహారంలో భాగంగా సోమవారం ఇడ్లీతో పాటు చట్నీ లేదా పొడి లేదా సాంబార్ అందించనున్నారు. లేదా పూరీ, కుర్మా ఉండనుంది. మంగళవారం ఇడ్లీతో పాటు చట్నీ లేదా పొడి లేదా సాంబార్ కానీ, లేదా ఉప్మాతో చట్నీ, పొడి, సాంబార్, మిక్చర్ వడ్డించనున్నారు. బుధవారం ఇడ్లీతో పాటు చట్నీ లేదా పొడి లేదా సాంబార్ లేదా పొంగల్తో చట్నీ లేదా పొడి లేదా సాంబార్ ఉండనుంది. గురువారం ఇడ్లీతో పాటు చట్నీ లేదా పొడి లేదా సాంబార్ లేదా పూరీ కుర్మా… శుక్రవారం ఇడ్లీతో పాటు చట్నీ లేదా పొడి లేదా సాంబార్ లేదా ఉప్మాతో చట్నీ లేదా పొడి లేదా సాంబార్.. శనివారం ఇడ్లీతో పాటు చట్నీ లేదా పొడి లేదా సాంబార్ లేదా పొంగల్తో చట్నీ లేదా పొడి లేదా సాంబార్ వడ్డించనున్నారు.
మధ్యాహ్న భోజనం లేదా రాత్రివేళ భోజనంలో భాగంగా వైట్ రైస్, కూర, పప్పు లేదా సాంబార్, పెరుగు, పచ్చడి వడ్డించనున్నారు. వారంలో ఏడు రోజులు మెను ఇలాగే ఉండనుంది. కానీ, కూర మాత్రం రోజుకో రకంగా ఉండనుంది.
బ్రేక్ ఫాస్ట్లో ఇడ్లీ, పూరీ అయితే, ఒక్కొక్కరికి 3 చొప్పున వడ్డించనున్నారు. ఉప్మా, పొంగల్ 250 గ్రాములు వడ్డిస్తారు. వైట్ రైస్ 400 గ్రాములు, చట్నీ లేదా పొడి 15 గ్రాములు, సాంబార్ 150 గ్రాములు, మిక్చర్ 25 గ్రాములు, కూర 100 గ్రాములు, పప్పు లేదా సాంబార్ 120 గ్రాములు, పచ్చడి 15 గ్రాములు, పెరుగు 75 గ్రాములు వడ్డించనున్నారు. బ్రేక్ ఫాస్ట్ ఉదయం 7.30 నుంచి 10 గంటల మధ్య ఉండనుంది. మధ్యాహ్న భోజనం 12.30 నుంచి 3 గంటల మధ్యలో ఏర్పాటు చేస్తున్నారు. రాత్రి భోజనం 7.30 నుంచి 9 గంటల మధ్య ఉంటుంది. ఆదివారం అన్నా క్యాంటిన్ కు సెలవు ఉంటుంది. అలాగే వారానికి ఒకరోజు స్పెషల్ రైస్ వడ్డిస్తారు.
ఈ మేరకు సీఎం చంద్రబాబు షెడ్యూల్ ఖరారైనట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తొలుత విశాఖ జిల్లాలో అన్నా క్యాంటీన్ను ప్రారంభించాలని సీఎం చంద్రబాబు భావించారు. అయితే, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన కోడ్ ఉండడంతో కార్యక్రమం వాయిదా పడింది. దీంతో కృష్ణా జిల్లాలోని గుడివాడ పట్టణంలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ను ప్రారంభించడం ద్వారా ఈ పథకాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు.
తాజా వార్తలు
- అబుదాబిలో అపార్ట్మెంట్ నుండి పడి యువకుడు మృతి..!!
- 17.6 కిలోల మెథాంఫేటమిన్ రవాణాను అడ్డుకున్న జాక్టా..!!
- కువైట్ లో అక్రమ క్రిప్టోకరెన్సీ మైనింగ్ కార్యకలాపాలపై ప్రచారం..!!
- దహిరాలో థర్డ్ స్కౌట్ క్యాంప్ అల్ ప్రారంభం..!!
- అల్ డైర్ సముద్ర తీరప్రాంతానికి ఫిషింగ్, సిట్టింగ్ ప్లాట్ఫామ్..!!
- ఖలీఫా అంతర్జాతీయ స్టేడియం.. మే 24న అమీర్ కప్ ఫైనల్కు ఆతిథ్యం..!!
- అమెరికాలో విదేశీ విద్యార్థులు హ్యాపీ
- విశాఖలో తలసేమియా బాధితుల కోసం మే 8న భరోసా కల్పిద్దాం-నారా భువనేశ్వరి
- నేడే పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు…తరలి వస్తున్న ప్రపంచదేశాల అధినేతలు
- సౌదీ అరేబియా విజన్ 2030 వార్షిక నివేదిక..ప్రధాన లక్ష్యాలు పూర్తి..!!