తొలిసారి జెండాను ఎగురవేసిన సీఎం రేవంత్
- August 15, 2024
హైదరాబాద్: సీఎం హోదాలో రేవంత్ రెడ్డి గోల్కొండ కోటపై తొలిసారి జాతీయ జెండాను ఎగురవేశారు. పతాక ఆవిష్కరణ తర్వాత జాతీయ గీతం జనగణమన ఆలపించారు. అనంతరం తెలంగాణ గీతం జయ జయహే తెలంగాణ పాట ప్లే చేశారు. సాయుధ బలగాల గౌరవ వందనం తర్వాత పలు సాంస్కృతి కార్యక్రమాలను వీక్షించారు. ఈ సందర్భంగా భారత దేశ ప్రజలందరికీ రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా పరేడ్ గ్రౌండ్స్లోని సైనికుల స్మారక స్థూపం వద్దకు వెళ్లారు. అక్కడ పుష్పగుచ్ఛం పెట్టి నివాళి అర్పించారు. అటు తెలంగాణ సచివాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సీఎస్ శాంతి కుమారి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్









