కోల్కతా వైద్యరాలి హత్యాచార ఘటన పై సౌరవ్ గంగూలీ వినూత్న రీతిలో నిరసన
- August 20, 2024
కోల్ కతా: పశ్చిమ బెంగాల్ లోని కోల్ కతాలో జూనియర్ వైద్యురాలిపై హత్యాచారం, హత్య ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్నాయి. ఆగస్టు 9న ఆర్జీ కార్ మెడికల్ కాలేజీలో ఈ దారుణ ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో నేరస్థుడిని కఠినంగా శిక్షించాలని పెద్దెత్తున ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళన నిర్వహిస్తున్నారు. అయితే, గత వారం రోజుల క్రితం ఓ కార్యక్రమంలో వైద్యురాలి హత్య ఘటనపై గంగూలీ స్పందించారు. ఇది చాలా దురదృష్టకర ఘటన. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలి. మహిళల భద్రతను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం అవసరం. అయితే, కేవలం ఒక్క ఘటనతో రాష్ట్రంపై మనం ఓ అభిప్రాయానికి రాకూడదు అని వ్యాఖ్యానించాడు. గంగూలీ స్పందనపై పలువురు నెటిజన్లు విమర్శలు గుప్పించారు.
తన వ్యాఖ్యలపై వస్తున్న విమర్శలకు గంగూలీ గత శనివారం స్పందించారు. గత వారం నేను చేసిన వ్యాఖ్యలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారు. మరికొందరు వక్రీకరించారు. ఏదేమైనా జరిగిన ఘటన దారుణమైంది. ఈ ఘటనలో నేరస్థుడిని కఠినంగా శిక్షించాలని, భవిష్యత్తులో ఇంకెవరైనా ఇలాంటి దారుణానికి పాల్పడే సాహజం చేయకూడదు. శిక్ష చాలా తీవ్రంగా ఉండాలని గంగూలీ అభిప్రాయ పడ్డారు. ఈ ఘటనపై గంగూలీ తాజాగా వినూత్న రీతిలో తన నిరసనను వ్యక్తం చేశారు. ట్విటర్ లో తన ప్రొఫైల్ ఫొటోను తొలగించి బ్లాక్ చేశాడు. అలాగే, అతను క్యాప్షన్ లో.. కొత్త ప్రొఫైల్ పిక్.. అని గంగూలీ రాశాడు.
తాజా వార్తలు
- ఉద్యోగుల సోషల్ మీడియా అకౌంట్లపై కేంద్రం ఫోకస్
- President of Senegal receives Al Zeyoudi in Dakar to discuss expanding trade and investment partnership
- యువత కోసం ట్రావెల్-ఫస్ట్ డిజిటల్ కార్డు
- ఢిల్లీలో భారీ వర్షాలు..ఎయిర్పోర్ట్లో వరద నీరు
- సౌదీ అరేబియాలో కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ పర్యటన
- ‘అరబ్ రీడింగ్ ఛాలెంజ్’ విజేతలతో షేక్ మొహమ్మద్ భేటీ
- నేపాల్కు మూడో యూఏఈ సహాయక విమానం.. సెర్చ్ అండ్ రెస్క్యూ బృందం రాక
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ







