మహిళలు, యువవైద్యుల భద్రతపై సుప్రీంకోర్టు ఆందోళన
- August 20, 2024
న్యూఢిల్లీ: మహిళలు, యువవైద్యుల భద్రతపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వైద్యుల పనిప్రదేశంలో భద్రత కోసం ప్రణాళికను రూపొందించడానికి పది మంది సభ్యులతో టాస్క్ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతాలో ట్రైనీ డాక్టర్ హత్య, అత్యాచారం కేసును సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించిన సంగతి తెలిసిందే.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డి.వై. చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ కేసుపై మంగళవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పలు ప్రశ్నలు సంధించింది. బాధితురాలి పేరు, ఫోటోలు, వీడియోలు మీడియాలో వైరల్ కావడం పట్ల తీవ్ర ఆందోళన చెందుతున్నామని పేర్కొంది. ఈ కేసులో సరైన సమయంలో ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించింది. పోస్ట్మార్టమ్లో వైద్యురాలు హత్యకు గురైనట్లు తేలినా.. రాత్రి 11.45 గంటల వరకు ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేశారని ప్రశ్నించింది. ఆస్పత్రిలో అధికారులు ఏం చేస్తున్నారు అని నిలదీసింది. ప్రిన్సిపల్ ఏం చేస్తున్నాడు.. ఆత్మహత్యగా ఎందుకు ప్రకటించారు. గురువారంలోగా దర్యాప్తు స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలని సిబిఐకి ఆదేశించింది. కార్యాలయంలో మహిళల భద్రత గురించి ఎదురవుతున్న ఆందోళనలపై పౌరులు మాట్లాడాల్సిన అవసరం ఉందని అన్నారు.
తాజా వార్తలు
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!









