సెట్స్ పైకి నాగ్ కొత్త చిత్రం
- June 17, 2016
'అన్నమయ్య', 'శ్రీరామదాసు', 'శిరిడిసాయి' వంటి భక్తిరస చిత్రాలు అందించిన నాగార్జున-రాఘవేంద్రరావు కాంబినేషన్... మరోసారి సెట్స్ పైకి వెళ్లేందుకు సిద్ధమవుతోంది. ఈ ఇద్దరి కలయికలో తిరుమలేశుని భక్తుడు హాథీరామ్ బాబా జీవితం ఆధారంగా తరకెక్కనున్న 'ఓం నమో వేంకటేశాయ' చిత్రం ప్రీ-ప్రొడక్షన్ కార్యక్రమాలు ముగించుకుని షూటింగ్కు రెడీ అవుతోంది. ఈ నెల 29 నుంచి ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. 'ఓం నమో వేంకటేశాయ' సినిమాకు సంబంధించి.. కీరవాణి సంగీత సారథ్యంలో ఇప్పటికే నాలుగు పాటల రికార్డింగ్ కూడా పూర్తయింది. తాజాగా నటీనటులు, ఇతర టెక్నీషియన్స్ ఎంపిక పూర్తిచేసిన చిత్రయూనిట్..
29 నుంచి షూటింగ్ను ప్రారంభించబోతున్నారు. హాథీరామ్ బాబాగా నాగార్జున ప్రధానపాత్రలో నటించనున్న ఈ చిత్రంలో ముగ్గురు కథానాయికలు కీలకపాత్రలు పోషించబోతున్నారు. సన్యాసినిగా అనుష్క, శ్రీదేవి అమ్మవారి పాత్రలో విమలా రామన్, మరో కీలక పాత్రలో ప్రగ్యా జైస్వాల్ కనిపించనున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







