సెట్స్ పైకి నాగ్ కొత్త చిత్రం

- June 17, 2016 , by Maagulf
సెట్స్ పైకి నాగ్ కొత్త చిత్రం

'అన్నమయ్య', 'శ్రీరామదాసు', 'శిరిడిసాయి' వంటి భక్తిరస చిత్రాలు అందించిన నాగార్జున-రాఘవేంద్రరావు కాంబినేషన్... మరోసారి సెట్స్ పైకి వెళ్లేందుకు సిద్ధమవుతోంది. ఈ ఇద్దరి కలయికలో తిరుమలేశుని భక్తుడు హాథీరామ్ బాబా జీవితం ఆధారంగా తరకెక్కనున్న 'ఓం నమో వేంకటేశాయ' చిత్రం ప్రీ-ప్రొడక్షన్ కార్యక్రమాలు ముగించుకుని షూటింగ్‌కు రెడీ అవుతోంది. ఈ నెల 29 నుంచి ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. 'ఓం నమో వేంకటేశాయ' సినిమాకు సంబంధించి.. కీరవాణి సంగీత సారథ్యంలో ఇప్పటికే నాలుగు పాటల రికార్డింగ్ కూడా పూర్తయింది. తాజాగా నటీనటులు, ఇతర టెక్నీషియన్స్ ఎంపిక పూర్తిచేసిన చిత్రయూనిట్..
29 నుంచి షూటింగ్‌ను ప్రారంభించబోతున్నారు. హాథీరామ్ బాబాగా నాగార్జున ప్రధానపాత్రలో నటించనున్న ఈ చిత్రంలో ముగ్గురు కథానాయికలు కీలకపాత్రలు పోషించబోతున్నారు. సన్యాసినిగా అనుష్క, శ్రీదేవి అమ్మవారి పాత్రలో విమలా రామన్, మరో కీలక పాత్రలో ప్రగ్యా జైస్వాల్ కనిపించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com