సెట్స్ పైకి నాగ్ కొత్త చిత్రం
- June 17, 2016
'అన్నమయ్య', 'శ్రీరామదాసు', 'శిరిడిసాయి' వంటి భక్తిరస చిత్రాలు అందించిన నాగార్జున-రాఘవేంద్రరావు కాంబినేషన్... మరోసారి సెట్స్ పైకి వెళ్లేందుకు సిద్ధమవుతోంది. ఈ ఇద్దరి కలయికలో తిరుమలేశుని భక్తుడు హాథీరామ్ బాబా జీవితం ఆధారంగా తరకెక్కనున్న 'ఓం నమో వేంకటేశాయ' చిత్రం ప్రీ-ప్రొడక్షన్ కార్యక్రమాలు ముగించుకుని షూటింగ్కు రెడీ అవుతోంది. ఈ నెల 29 నుంచి ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. 'ఓం నమో వేంకటేశాయ' సినిమాకు సంబంధించి.. కీరవాణి సంగీత సారథ్యంలో ఇప్పటికే నాలుగు పాటల రికార్డింగ్ కూడా పూర్తయింది. తాజాగా నటీనటులు, ఇతర టెక్నీషియన్స్ ఎంపిక పూర్తిచేసిన చిత్రయూనిట్..
29 నుంచి షూటింగ్ను ప్రారంభించబోతున్నారు. హాథీరామ్ బాబాగా నాగార్జున ప్రధానపాత్రలో నటించనున్న ఈ చిత్రంలో ముగ్గురు కథానాయికలు కీలకపాత్రలు పోషించబోతున్నారు. సన్యాసినిగా అనుష్క, శ్రీదేవి అమ్మవారి పాత్రలో విమలా రామన్, మరో కీలక పాత్రలో ప్రగ్యా జైస్వాల్ కనిపించనున్నారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









