శ్రీలంక క్రీడారంగానికి మోదీ చేయూత

- June 17, 2016 , by Maagulf
శ్రీలంక క్రీడారంగానికి మోదీ చేయూత

భారత ప్రధాని నరేంద్ర మోదీ, శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనలు కలిసి శ్రీలంకలోని జాఫ్నా స్టేడియంను ప్రారంభించనున్నారు. ఈ స్టేడియంను భారత్‌ సహాయంతో పునర్నిర్మించారు. సిరిసేన స్టేడియం ప్రారంభోత్సవం చేసే సమయంలో నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొంటారని ప్రధాని మంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. మాజీ మేయర్‌ జాఫ్నా పేరుమీదుగా గతంలోని దురయప్ప స్టేడియంను జాఫ్నా స్టేడియంగా పేరు మార్చారు. ఈ స్టేడియం పునర్నిర్మాణానికి భారత ప్రభుత్వం రూ.7కోట్లు వెచ్చించింది. ఈ స్టేడియంలో 1850 మంది కూర్చోవచ్చు. క్రీడలను ప్రోత్సహించడం కోసం ఇందులో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించినట్లు ప్రకటనలో వెల్లడించారు. త్వరలో రెండో యోగా అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా స్టేడియంలో యోగాపై కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇందులో దాదాపు 8వేల మంది పాల్గొనే అవకాశముందని చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com