శ్రీలంక క్రీడారంగానికి మోదీ చేయూత
- June 17, 2016
భారత ప్రధాని నరేంద్ర మోదీ, శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనలు కలిసి శ్రీలంకలోని జాఫ్నా స్టేడియంను ప్రారంభించనున్నారు. ఈ స్టేడియంను భారత్ సహాయంతో పునర్నిర్మించారు. సిరిసేన స్టేడియం ప్రారంభోత్సవం చేసే సమయంలో నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొంటారని ప్రధాని మంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. మాజీ మేయర్ జాఫ్నా పేరుమీదుగా గతంలోని దురయప్ప స్టేడియంను జాఫ్నా స్టేడియంగా పేరు మార్చారు. ఈ స్టేడియం పునర్నిర్మాణానికి భారత ప్రభుత్వం రూ.7కోట్లు వెచ్చించింది. ఈ స్టేడియంలో 1850 మంది కూర్చోవచ్చు. క్రీడలను ప్రోత్సహించడం కోసం ఇందులో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించినట్లు ప్రకటనలో వెల్లడించారు. త్వరలో రెండో యోగా అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా స్టేడియంలో యోగాపై కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇందులో దాదాపు 8వేల మంది పాల్గొనే అవకాశముందని చెప్పారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







