ఇరాక్లో తెలంగాణ వాసి మృతి..
- August 23, 2024
బాగ్దాద్: ఇరాక్లో జన్నారం మండలంలోని చింతగూడ గ్రామానికి చెందిన సంపంగి రాజమల్లు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు..కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం. రాజమల్లు గత ఏడు సంవత్సరాల క్రితం ఇరాక్ దేశానికి బతుకుతెరువు కోసం వెళ్లి, అక్కడ ఓ కంపెనీలో పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.ఈక్రమంలో గురువారం కంపెనీకి పనికి వెళ్లేటప్పుడు రోడ్డు ప్రమాదంలో రాజమల్లు చెందాడు.
ఇరాక్లోని రాజమల్లుతో పాటు పనిచేసే వారు ఈ సమాచారాన్ని తండ్రి పెద్ద మల్లయ్య తల్లి రాజవ్వలకు తెలిపారు. దీంతో చింతగూడ గ్రామంలో రాజమల్లు బంధుమిత్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. రాజమల్లు మృతితో చింతగూడ గ్రామంలో విషాదఛాయలు ఉన్నాయి. తన కుమారుని శవాన్ని త్వరగా ఇండియాకు తీసుకురావాలని పెద్ద మల్లయ్య తల్లి రాజవలు కోరుతున్నారు. అందుకు ప్రభుత్వం స్పందించాలని వారు వేడుకుంటున్నారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







