ఇరాక్లో తెలంగాణ వాసి మృతి..
- August 23, 2024
బాగ్దాద్: ఇరాక్లో జన్నారం మండలంలోని చింతగూడ గ్రామానికి చెందిన సంపంగి రాజమల్లు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు..కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం. రాజమల్లు గత ఏడు సంవత్సరాల క్రితం ఇరాక్ దేశానికి బతుకుతెరువు కోసం వెళ్లి, అక్కడ ఓ కంపెనీలో పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.ఈక్రమంలో గురువారం కంపెనీకి పనికి వెళ్లేటప్పుడు రోడ్డు ప్రమాదంలో రాజమల్లు చెందాడు.
ఇరాక్లోని రాజమల్లుతో పాటు పనిచేసే వారు ఈ సమాచారాన్ని తండ్రి పెద్ద మల్లయ్య తల్లి రాజవ్వలకు తెలిపారు. దీంతో చింతగూడ గ్రామంలో రాజమల్లు బంధుమిత్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. రాజమల్లు మృతితో చింతగూడ గ్రామంలో విషాదఛాయలు ఉన్నాయి. తన కుమారుని శవాన్ని త్వరగా ఇండియాకు తీసుకురావాలని పెద్ద మల్లయ్య తల్లి రాజవలు కోరుతున్నారు. అందుకు ప్రభుత్వం స్పందించాలని వారు వేడుకుంటున్నారు.
తాజా వార్తలు
- జాయింట్ భద్రతా ప్రాజెక్టుల్లో డేటా రక్షణకు యూఏఈ–ఖతర్ అవగాహన ఒప్పందం
- వాట్సాప్లో అద్భుతమైన ఫీచర్..
- చికాగోలో NATS అడాప్ట్ ఎ హైవే కు మంచి స్పందన
- షార్జా యూనివర్సిటీ ఆసుపత్రి విస్తరణకు AED 300 మిలియన్ల మంజూరు
- ‘దుబాయ్-ఇట్’ వ్యూహాన్ని ఆవిష్కరించిన షేక్ మొహమ్మద్
- కృష్ణలంక ఘటన పై ఏపీ ప్రభుత్వం సీరియస్..
- NEET పరీక్ష సమయంలో టెలిగ్రామ్ నిషేధం..రాహుల్ గాంధీ ఆగ్రహం
- హైదరాబాద్లో టెస్లా ఎక్స్పీరియన్స్ సెంటర్
- ఇరాన్ విషయంలో మరో బాంబ్ పేల్చిన ట్రంప్
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన అధికారులు









