టెలిగ్రామ్ ఫౌండర్, సీఈఓ పావెల్ దురోవ్ అరెస్ట్
- August 25, 2024
పారిస్: టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు, సీఈఓ పావెల్ దురోవ్ను(39) పారిస్లో పోలీసులు అరెస్టు చేశారు. అజర్బైజాన్ నుంచి లే బోర్గట్ విమానాశ్రయానికి చేరుకున్న ఆయన్ను కస్టడీలోకి తీసుకున్నారు. టెలిగ్రామ్లో మోసం, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, సైబర్ నేరాలు, పిల్లలపై నేరాలు, పెడోఫిలిక్ కంటెంట్, వ్యవస్థీకృత నేరాల్ని ప్రోత్సహించడం వంటి ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. దీంతో గతంలో అరెస్టు వారెంట్ జారీ చేసిన అధికారులు, తాజాగా అదుపులోకి తీసుకున్నారు.
అయితే, తన పై అరెస్ట్ వారెంట్ జారీ అయినప్పటి నుంచి దురోవ ప్రాన్స్, యూరప్లోని దేశాల్లో పర్యటించలేదు. తాజాగా లే బోర్గట్ వచ్చిన పావెల్ దురోవ్ను అరెస్ట్ చేసినట్లు మాస్కో టైమ్స్ పేర్కొంది.
టెలిగ్రామ్ యాప్ వ్యవస్థాపకుడు దురోవ్ రష్యాలో జన్మించారు. ప్రస్తుతం అయన దుబాయ్లో ఉంటున్నారు. VKontakte యాప్నకు సంబంధించి వినియోగదారుల డేటాను రష్యాలో భద్రతా అధికారులతో పంచుకోవడానికి నిరాకరించారు. దీంతో అక్కడి ప్రభుత్వంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత టెలిగ్రామ్నూ అడ్డుకునేందుకు రష్యా ప్రభుత్వం విఫలయత్నం చేసింది. దీంతో దురోవ్ 2014లో రష్యాను విడిచిపెట్టారు. 2021 ఆగస్టులో ఫ్రెంచ్ పౌరసత్వ తీసుకున్నారు. ఈ నేపథ్యంలో తనపై అరెస్టు వారెంట్ ఉన్నప్పటికీ, పావెల్ దురోవ్ పారిస్కు రావడంపై విచారణ అధికారి ఒకరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పావెల్ను ఆదివారం న్యాయస్థానంలో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. ఇక టెలిగ్రామ్ యాప్ను ప్రపంచవ్యాప్తంగా సుమారు 900 మిలియన్ల మంది వినియోగిస్తున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







