ఒమన్ ఆకస్మిక వరదలలో ఇద్దరు ఎమిరాటీలు మృతి..!

- August 26, 2024 , by Maagulf
ఒమన్ ఆకస్మిక వరదలలో ఇద్దరు ఎమిరాటీలు మృతి..!

మస్కట్: ఒమన్‌లో విషాదక ఘటనలో ప్రాణాలు కోల్పోయిన నలుగురు హైకర్లలో ఇద్దరు ఎమిరాటీలు ఉన్నారు.  నిజ్వాలోని వాడి తనూఫ్‌లో భారీ వర్షాలను నేపథ్యంలో 16 మంది పర్వతారోహకుల బృందంలో ఇద్దరు ఎమిరాటీలు ఖలీద్ అల్ మన్సూరీ, సేలం అల్ జర్రాఫ్‌తో సహా నలుగురు మరణించారని రాయల్ ఒమన్ పోలీసులు X లో తెలిపారు. మరొక వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా మరియు పోలీసు విమానంలో నిజ్వా రిఫరెన్స్ ఆసుపత్రికి తరలించి నట్టు తెలిపారు. యూఏఈ మాజీ హ్యాండ్‌బాల్ ఆటగాడు, జావెలిన్ ఛాంపియన్ అయిన ఖలీద్ అల్ మన్సూరీ.. సాహస క్రీడల ఔత్సాహికుడు సేలం అల్ జర్రాఫ్ ఇద్దరూ తమ తమ కమ్యూనిటీలలో ప్రసిద్ధ వ్యక్తులు. ఒమన్ నుండి వారి మృతదేహాలను స్వదేశానికి తీసుకువచ్చిన తర్వాత వారి అంత్యక్రియలు అబుదాబి, రస్ అల్ ఖైమాలో నిర్వహించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com