ఒమన్ ఆకస్మిక వరదలలో ఇద్దరు ఎమిరాటీలు మృతి..!
- August 26, 2024
మస్కట్: ఒమన్లో విషాదక ఘటనలో ప్రాణాలు కోల్పోయిన నలుగురు హైకర్లలో ఇద్దరు ఎమిరాటీలు ఉన్నారు. నిజ్వాలోని వాడి తనూఫ్లో భారీ వర్షాలను నేపథ్యంలో 16 మంది పర్వతారోహకుల బృందంలో ఇద్దరు ఎమిరాటీలు ఖలీద్ అల్ మన్సూరీ, సేలం అల్ జర్రాఫ్తో సహా నలుగురు మరణించారని రాయల్ ఒమన్ పోలీసులు X లో తెలిపారు. మరొక వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా మరియు పోలీసు విమానంలో నిజ్వా రిఫరెన్స్ ఆసుపత్రికి తరలించి నట్టు తెలిపారు. యూఏఈ మాజీ హ్యాండ్బాల్ ఆటగాడు, జావెలిన్ ఛాంపియన్ అయిన ఖలీద్ అల్ మన్సూరీ.. సాహస క్రీడల ఔత్సాహికుడు సేలం అల్ జర్రాఫ్ ఇద్దరూ తమ తమ కమ్యూనిటీలలో ప్రసిద్ధ వ్యక్తులు. ఒమన్ నుండి వారి మృతదేహాలను స్వదేశానికి తీసుకువచ్చిన తర్వాత వారి అంత్యక్రియలు అబుదాబి, రస్ అల్ ఖైమాలో నిర్వహించనున్నారు.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









