భారత దేశవ్యాప్తంగా కృష్ణాష్టమి వేడుకలు..
- August 26, 2024
న్యూ ఢిల్లీ: భారత దేశ వ్యాప్తంగానేకాక, ప్రపంచ వ్యాప్తంగా హిందువులు పవిత్రంగా జరుపుకునే పండుగల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి ఒకటి. ఈ పర్వదినాన్నే కృష్ణాష్టమి, గోకులాష్టమి.. ఇంకా అష్టమి రోహిణి అనికూడా అంటారు. ప్రతీ సంవత్సరం శ్రావణ మాసం కృష్ణ పక్షంలోని అష్టమి తిథి, రోహిణి నక్షత్రంలో కృష్ణాష్టమి వేడుకలు జరుపుకుంటారు. కృష్ణాష్టమి సందర్భంగా దేశ వ్యాప్తంగా శ్రీకృష్ణుని దేవాలయాలు ఉదయం నుంచి భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కృష్ణాష్టమి సందర్భంగా ఇస్కాన్ ఆలయాలను సర్వాంగసుందరంగా ముస్తాబు చేశారు. ఆ ఆలయాలకు భక్తులు పోటెత్తారు.
విష్ణువుకు అత్యంత ఇష్టమైన అవతారాల్లో శ్రీకృష్ణుడు అవతారం ఒకటని చెబుతారు. చిన్నతనంలో తల్లి యశోద బాల గోపాలుడిని అందంగా ముస్తాబు చేసేది. ఇందులో నెమలి కిరీటం, నడుము పట్టీ, ప్రకాశవంతమైన బొట్టు, చెవిపోగులు, పసుపు కండువా.. ఇలా మొదలైన వస్తువులతో శ్రీకృష్ణుడు ప్రకాశవంతంగా మెరిసేవారు. భక్తులు జన్మాష్టమి సందర్భంగా కృష్ణుడికి ఈ వస్తువులన్నీ సమర్పించాలి. దీని వల్ల ఇంట్లో సుఖసంతోషాలు, శ్రేయస్సులు లభిస్తాయని నమ్ముతారు. వైదిక క్యాలెండర్ ప్రకారం భాద్రపద మాసంలోని కృష్ణ పక్ష అష్టమి ఆగస్టు 25 ఆదివారం సాయంత్రం 6.09 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు ఆగస్టు 26వ తేదీ (సోమవారం) సాయంత్రం 4,49 గంటలకు ముగుస్తుంది. ఈ సంవత్సరం జన్మాష్టమి నాడు చంద్రుడు వృషశరాశిలో ఉండటం వల్ల జయంతి యోగం ఏర్పడుతుంది. ఈ శుభ సమయంలో పూజ చేయడం ద్వారా మంచి ఫలితాలు లభిస్తాయని భక్తుల విశ్వాసం. జన్మాష్టమి ఆగస్టు 26వ తేదీ ఉదయం 12.01గంటల నుంచి 12.45గంటల వరకు ఉంటుంది. అంటే ఈ 45 నిమిషాల సమయంలో భక్తులు పూజ చేసుకోవడానికి అనువైన సమయం అని పండితులు పేర్కొంటున్నారు.
తాజా వార్తలు
- ఉద్యోగుల సోషల్ మీడియా అకౌంట్లపై కేంద్రం ఫోకస్
- President of Senegal receives Al Zeyoudi in Dakar to discuss expanding trade and investment partnership
- యువత కోసం ట్రావెల్-ఫస్ట్ డిజిటల్ కార్డు
- ఢిల్లీలో భారీ వర్షాలు..ఎయిర్పోర్ట్లో వరద నీరు
- సౌదీ అరేబియాలో కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ పర్యటన
- ‘అరబ్ రీడింగ్ ఛాలెంజ్’ విజేతలతో షేక్ మొహమ్మద్ భేటీ
- నేపాల్కు మూడో యూఏఈ సహాయక విమానం.. సెర్చ్ అండ్ రెస్క్యూ బృందం రాక
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ







