భారత దేశవ్యాప్తంగా కృష్ణాష్టమి వేడుకలు..
- August 26, 2024
న్యూ ఢిల్లీ: భారత దేశ వ్యాప్తంగానేకాక, ప్రపంచ వ్యాప్తంగా హిందువులు పవిత్రంగా జరుపుకునే పండుగల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి ఒకటి. ఈ పర్వదినాన్నే కృష్ణాష్టమి, గోకులాష్టమి.. ఇంకా అష్టమి రోహిణి అనికూడా అంటారు. ప్రతీ సంవత్సరం శ్రావణ మాసం కృష్ణ పక్షంలోని అష్టమి తిథి, రోహిణి నక్షత్రంలో కృష్ణాష్టమి వేడుకలు జరుపుకుంటారు. కృష్ణాష్టమి సందర్భంగా దేశ వ్యాప్తంగా శ్రీకృష్ణుని దేవాలయాలు ఉదయం నుంచి భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కృష్ణాష్టమి సందర్భంగా ఇస్కాన్ ఆలయాలను సర్వాంగసుందరంగా ముస్తాబు చేశారు. ఆ ఆలయాలకు భక్తులు పోటెత్తారు.
విష్ణువుకు అత్యంత ఇష్టమైన అవతారాల్లో శ్రీకృష్ణుడు అవతారం ఒకటని చెబుతారు. చిన్నతనంలో తల్లి యశోద బాల గోపాలుడిని అందంగా ముస్తాబు చేసేది. ఇందులో నెమలి కిరీటం, నడుము పట్టీ, ప్రకాశవంతమైన బొట్టు, చెవిపోగులు, పసుపు కండువా.. ఇలా మొదలైన వస్తువులతో శ్రీకృష్ణుడు ప్రకాశవంతంగా మెరిసేవారు. భక్తులు జన్మాష్టమి సందర్భంగా కృష్ణుడికి ఈ వస్తువులన్నీ సమర్పించాలి. దీని వల్ల ఇంట్లో సుఖసంతోషాలు, శ్రేయస్సులు లభిస్తాయని నమ్ముతారు. వైదిక క్యాలెండర్ ప్రకారం భాద్రపద మాసంలోని కృష్ణ పక్ష అష్టమి ఆగస్టు 25 ఆదివారం సాయంత్రం 6.09 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు ఆగస్టు 26వ తేదీ (సోమవారం) సాయంత్రం 4,49 గంటలకు ముగుస్తుంది. ఈ సంవత్సరం జన్మాష్టమి నాడు చంద్రుడు వృషశరాశిలో ఉండటం వల్ల జయంతి యోగం ఏర్పడుతుంది. ఈ శుభ సమయంలో పూజ చేయడం ద్వారా మంచి ఫలితాలు లభిస్తాయని భక్తుల విశ్వాసం. జన్మాష్టమి ఆగస్టు 26వ తేదీ ఉదయం 12.01గంటల నుంచి 12.45గంటల వరకు ఉంటుంది. అంటే ఈ 45 నిమిషాల సమయంలో భక్తులు పూజ చేసుకోవడానికి అనువైన సమయం అని పండితులు పేర్కొంటున్నారు.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









