తిరుమల భక్తులకు షాక్‌..లడ్డులపై ఆంక్షలు..ఇకపై ఆధార్‌ ఉంటేనే!

- August 29, 2024 , by Maagulf
తిరుమల భక్తులకు షాక్‌..లడ్డులపై ఆంక్షలు..ఇకపై ఆధార్‌ ఉంటేనే!

తిరుమల శ్రీవారి భక్తులుకు షాక్ ఇచ్చింది టిటిడి పాలక మండలి. భక్తులుకు కోరినన్ని లడ్డులు జారి విధానం పై ఆంక్షలు విధించింది టిటిడి పాలక మండలి.

తిరుమలకు చాలా సంఖ్యలో భక్తులు వస్తూంటారు. ఈ తరుణంలోనే.. ఒక్కో భక్తుడు తమకు నచ్చినన్ని లడ్డూలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తాడు.

అయితే.. అలాంటి తిరుమల శ్రీవారి భక్తులుకు షాక్ ఇచ్చింది టిటిడి పాలక మండలి. ఇక పై ఆధార్ కార్డు వుంటేనే భక్తులకు అదనపు లడ్డులు ఇవ్వనుంది టిటిడి పాలక మండలి. ఒక భక్తుడికి రెండు లడ్డులు మాత్రమే జారి చేస్తూన్నది టిటిడి పాలక మండలి. ఒక్కసారి లడ్డు తీసుకుంటే నెల రోజులు పాటు లడ్డు పోందే అవకాశం లేదంటున్నారు కౌంటర్ సిబ్బంది. ఇక టిటిడి పాలక మండలి తాజా నిర్ణయం పై మండిపడుతున్నారు తిరుమల శ్రీ వారి భక్తులు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com