5,000 దిర్హామ్లకు రెసిడెన్సీ వీసా ఆఫర్..ఇది స్కామ్..నిపుణులు హెచ్చరిక..!
- August 29, 2024
యూఏఈ: యూఏఈ ప్రకటించిన రెండు నెలల క్షమాభిక్ష కార్యక్రమం సెప్టెంబరు 1 నుండి ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో స్కామర్లు తప్పుడు ప్రకటనలతో రెచ్చిపోతున్నారు. తక్కువ ధరలకు రెసిడెన్సీ వీసాల పేరిట మోసపూరిత ఆఫర్లతో ప్రవాసులను మభ్యపెడుతున్నారు.5,000 దిర్హామ్లకు రెసిడెన్సీ వీసాలను అందిస్తామని తమను కొందరు సంప్రదించారని జెబెల్ అలీ, సోనాపూర్లలో నివసిస్తున్న కొద్ది మంది నివాసితులు తెలిపారు.చాలా కాలంగా దేశంలో నివసిస్తున్న నివాసితులు ఎలాగైన రెసిడెన్సీ సంపాదించి యూఏఈలో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. వీరి ఆశలను కొందరు సొమ్ము చేసుకునేందుకు తప్పుడు ప్రకటనలతో మోసాలకు పాల్పడుతున్నారు.
ఇమ్మిగ్రేషన్ నిపుణులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. చట్టబద్ధమైన రెసిడెన్సీ వీసాను పొందడానికి అసలు ఖర్చు Dh5,000 కంటే ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు.సెవెన్ సిటీ డాక్యుమెంట్ క్లియరింగ్ సర్వీసెస్కు చెందిన మహ్మద్ దావూద్ షాబుద్దీన్ మాట్లాడుతూ..స్కామర్లు క్షమాభిక్ష కాలాన్ని సద్వినియోగం చేసుకుని ఓవర్స్టేయర్లను నకిలీ ఆఫర్లతో ఆకర్షిస్తున్నారని తెలిపారు.ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, గుర్తింపు పొందిన ఏజెంట్లతో లేదా నేరుగా ప్రభుత్వ అధికారులతో మాత్రమే సంప్రదింపులు జరపాలని కోరారు.
తాజా వార్తలు
- పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్లో అత్యంత అరుదైన ఈఎన్టీ శస్త్రచికిత్సలు
- ఇండోనేషియాలో 22 మంది ఆహుతి
- విద్యార్థుల కోసం బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్
- సౌదీలో 2% పెరిగిన విదేశీ రెమిటెన్స్..!!
- దోహా, రియాద్ మధ్య 2గంటలు తగ్గనున్న ట్రావెల్ టైమ్..!!
- భారత్ కు బంగారం తీసుకువెళుతున్నారా?
- కువైట్ లో మాదకద్రవ్యాల రవాణకు పాల్పడితే ఉరిశిక్ష..!!
- గల్ఫ్ యూత్ లీడర్షిప్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఒమన్ ఆయిల్, గ్యాస్ ఆవిష్కరణ..శతాబ్ది ఉత్సవాలు..!!
- నైజీరియాలో అపహరణకు గురైన 100 మంది పిల్లల అప్పగింపు







