5,000 దిర్హామ్లకు రెసిడెన్సీ వీసా ఆఫర్..ఇది స్కామ్..నిపుణులు హెచ్చరిక..!
- August 29, 2024
యూఏఈ: యూఏఈ ప్రకటించిన రెండు నెలల క్షమాభిక్ష కార్యక్రమం సెప్టెంబరు 1 నుండి ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో స్కామర్లు తప్పుడు ప్రకటనలతో రెచ్చిపోతున్నారు. తక్కువ ధరలకు రెసిడెన్సీ వీసాల పేరిట మోసపూరిత ఆఫర్లతో ప్రవాసులను మభ్యపెడుతున్నారు.5,000 దిర్హామ్లకు రెసిడెన్సీ వీసాలను అందిస్తామని తమను కొందరు సంప్రదించారని జెబెల్ అలీ, సోనాపూర్లలో నివసిస్తున్న కొద్ది మంది నివాసితులు తెలిపారు.చాలా కాలంగా దేశంలో నివసిస్తున్న నివాసితులు ఎలాగైన రెసిడెన్సీ సంపాదించి యూఏఈలో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. వీరి ఆశలను కొందరు సొమ్ము చేసుకునేందుకు తప్పుడు ప్రకటనలతో మోసాలకు పాల్పడుతున్నారు.
ఇమ్మిగ్రేషన్ నిపుణులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. చట్టబద్ధమైన రెసిడెన్సీ వీసాను పొందడానికి అసలు ఖర్చు Dh5,000 కంటే ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు.సెవెన్ సిటీ డాక్యుమెంట్ క్లియరింగ్ సర్వీసెస్కు చెందిన మహ్మద్ దావూద్ షాబుద్దీన్ మాట్లాడుతూ..స్కామర్లు క్షమాభిక్ష కాలాన్ని సద్వినియోగం చేసుకుని ఓవర్స్టేయర్లను నకిలీ ఆఫర్లతో ఆకర్షిస్తున్నారని తెలిపారు.ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, గుర్తింపు పొందిన ఏజెంట్లతో లేదా నేరుగా ప్రభుత్వ అధికారులతో మాత్రమే సంప్రదింపులు జరపాలని కోరారు.
తాజా వార్తలు
- President of Senegal receives Al Zeyoudi in Dakar to discuss expanding trade and investment partnership
- యువత కోసం ట్రావెల్-ఫస్ట్ డిజిటల్ కార్డు
- ఢిల్లీలో భారీ వర్షాలు..ఎయిర్పోర్ట్లో వరద నీరు
- సౌదీ అరేబియాలో కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ పర్యటన
- ‘అరబ్ రీడింగ్ ఛాలెంజ్’ విజేతలతో షేక్ మొహమ్మద్ భేటీ
- నేపాల్కు మూడో యూఏఈ సహాయక విమానం.. సెర్చ్ అండ్ రెస్క్యూ బృందం రాక
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ
- తిరుమల శ్రీవారి ఆలయ కొత్త డిప్యూటీ ఈఓగా భాస్కర్!







