5,000 దిర్హామ్లకు రెసిడెన్సీ వీసా ఆఫర్..ఇది స్కామ్..నిపుణులు హెచ్చరిక..!
- August 29, 2024
యూఏఈ: యూఏఈ ప్రకటించిన రెండు నెలల క్షమాభిక్ష కార్యక్రమం సెప్టెంబరు 1 నుండి ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో స్కామర్లు తప్పుడు ప్రకటనలతో రెచ్చిపోతున్నారు. తక్కువ ధరలకు రెసిడెన్సీ వీసాల పేరిట మోసపూరిత ఆఫర్లతో ప్రవాసులను మభ్యపెడుతున్నారు.5,000 దిర్హామ్లకు రెసిడెన్సీ వీసాలను అందిస్తామని తమను కొందరు సంప్రదించారని జెబెల్ అలీ, సోనాపూర్లలో నివసిస్తున్న కొద్ది మంది నివాసితులు తెలిపారు.చాలా కాలంగా దేశంలో నివసిస్తున్న నివాసితులు ఎలాగైన రెసిడెన్సీ సంపాదించి యూఏఈలో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. వీరి ఆశలను కొందరు సొమ్ము చేసుకునేందుకు తప్పుడు ప్రకటనలతో మోసాలకు పాల్పడుతున్నారు.
ఇమ్మిగ్రేషన్ నిపుణులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. చట్టబద్ధమైన రెసిడెన్సీ వీసాను పొందడానికి అసలు ఖర్చు Dh5,000 కంటే ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు.సెవెన్ సిటీ డాక్యుమెంట్ క్లియరింగ్ సర్వీసెస్కు చెందిన మహ్మద్ దావూద్ షాబుద్దీన్ మాట్లాడుతూ..స్కామర్లు క్షమాభిక్ష కాలాన్ని సద్వినియోగం చేసుకుని ఓవర్స్టేయర్లను నకిలీ ఆఫర్లతో ఆకర్షిస్తున్నారని తెలిపారు.ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, గుర్తింపు పొందిన ఏజెంట్లతో లేదా నేరుగా ప్రభుత్వ అధికారులతో మాత్రమే సంప్రదింపులు జరపాలని కోరారు.
తాజా వార్తలు
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!







