దుబాయ్ ప్రమాదం..పిల్లలకు ప్రాణాంతకంగా అక్రమ రవాణా..!
- August 29, 2024
దుబాయ్: డబ్బు ఆదా కోసం అక్రమ రవాణా సేవలను ఉపయోగించకుండా వారి పిల్లల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని విద్యావేత్తలు తల్లిదండ్రులను కోరుతున్నారు. మంగళవారం హట్టా-లహబాబ్ రహదారిపై వాహనం బోల్తా పడిన ఘటనలో దుబాయ్ పాఠశాలకు చెందిన 7 ఏళ్ల విద్యార్థి ప్రాణాలు కోల్పోగా, మరో 11 మంది గాయపడిన సంఘటన నేపథ్యంలో ఈ హెచ్చరిక చేశారు.
అంబాసిడర్ స్కూల్ షార్జా ప్రిన్సిపాల్ డాక్టర్ ఆరోగ్య రెడ్డి మాట్లాడుతూ.. సుశిక్షితులైన సిబ్బంది ఉన్నందున పాఠశాల బస్సులు సేఫ్ అని సిఫార్సు చేస్తామన్నారు. బస్సు సిబ్బంది అందరూ షార్జా ప్రైవేట్ ఎడ్యుకేషన్ అథారిటీ (SPEA), రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) వంటి నియంత్రణ సంస్థలచే గుర్తింపు పొందారని, భద్రతా ప్రోటోకాల్లు ఖచ్చితంగా పాటిస్తారని తెలిపారు. ప్రైవేట్ డ్రైవర్లకు సరైన శిక్షణ ఉండదని, కొంతమంది డ్రైవర్లు తమ వాహనాల్లో పిల్లలతో కిక్కిరిసి తీసుకుపోతారని తెలిపారు. ఇది ప్రమాదాలకు దారితీస్తుందన్నారు.
తాజా వార్తలు
- అమెరికా-ఇజ్రాయెల్ దాడుల తర్వాత ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్









