దుబాయ్ ప్రమాదం..పిల్లలకు ప్రాణాంతకంగా అక్రమ రవాణా..!
- August 29, 2024
దుబాయ్: డబ్బు ఆదా కోసం అక్రమ రవాణా సేవలను ఉపయోగించకుండా వారి పిల్లల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని విద్యావేత్తలు తల్లిదండ్రులను కోరుతున్నారు. మంగళవారం హట్టా-లహబాబ్ రహదారిపై వాహనం బోల్తా పడిన ఘటనలో దుబాయ్ పాఠశాలకు చెందిన 7 ఏళ్ల విద్యార్థి ప్రాణాలు కోల్పోగా, మరో 11 మంది గాయపడిన సంఘటన నేపథ్యంలో ఈ హెచ్చరిక చేశారు.
అంబాసిడర్ స్కూల్ షార్జా ప్రిన్సిపాల్ డాక్టర్ ఆరోగ్య రెడ్డి మాట్లాడుతూ.. సుశిక్షితులైన సిబ్బంది ఉన్నందున పాఠశాల బస్సులు సేఫ్ అని సిఫార్సు చేస్తామన్నారు. బస్సు సిబ్బంది అందరూ షార్జా ప్రైవేట్ ఎడ్యుకేషన్ అథారిటీ (SPEA), రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) వంటి నియంత్రణ సంస్థలచే గుర్తింపు పొందారని, భద్రతా ప్రోటోకాల్లు ఖచ్చితంగా పాటిస్తారని తెలిపారు. ప్రైవేట్ డ్రైవర్లకు సరైన శిక్షణ ఉండదని, కొంతమంది డ్రైవర్లు తమ వాహనాల్లో పిల్లలతో కిక్కిరిసి తీసుకుపోతారని తెలిపారు. ఇది ప్రమాదాలకు దారితీస్తుందన్నారు.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









