భార‌తదేశ‌పు అత్యంత ధ‌న‌వంతుడిగా గౌతమ్ అదానీ

- August 29, 2024 , by Maagulf
భార‌తదేశ‌పు అత్యంత ధ‌న‌వంతుడిగా గౌతమ్ అదానీ

న్యూఢిల్లీ: బిలియనీర్ గౌతమ్ అదానీ దేశంలోనే అత్యంత ధ‌న‌వంతుడిగా అవ‌త‌రించారు. తాజాగా వెలువ‌డిన‌ 2024 హురున్ ఇండియా ధ‌న‌వంతుల జాబితాలో రూ. 11.6 లక్షల కోట్ల సంపదతో ముఖేశ్ అంబానీని వెన‌క్కి నెట్టి అగ్రస్థానంలో నిలిచారు. ఇక రూ. 10.14 లక్షల కోట్ల సంపదతో అంబానీ కుటుంబం రెండో స్థానంలో నిలిచింది. కాగా, అదానీ స్థానం భారతీయ వ్యాపార రంగంలో అతని ఆధిపత్య ఉనికిని చాటిందనే చెప్పాలి. ఆయ‌న సంప‌ద ఏడాది కాలంలోనే ఏకంగా 95 శాతం పెర‌గ‌డం గ‌మ‌నార్హం.

అటు హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ అధినేత‌ శివ్ నాడార్ రూ. 3.14 లక్షల కోట్లతో మూడో స్థానం ద‌క్కించుకున్నారు. అలాగే సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు చెందిన సైరస్ ఎస్. పూనావాలా రూ. 2.89 లక్ష‌ల కోట్ల సంప‌ద‌తో నాలుగో స్థానంలో నిలిచారు. గత ఏడాదిలో మ‌న ద‌గ్గ‌ర‌ ప్రతి ఐదు రోజులకు ఒక కొత్త బిలియనీర్ పుట్టుకొచ్చిన‌ట్లు హురున్ ఇండియా నివేదిక పేర్కొంది. ఇండియాలో ప్ర‌స్తుతం 334 మంది బిలియనీర్లు ఉన్నారు. గతేడాదితో పోలిస్తే 75 మంది పెరిగిన‌ట్లు నివేదిక తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com