బాలకృష్ణ నట స్వర్ణోత్సవ వేడుకలకు మెగాస్టార్..
- September 01, 2024
హైదరాబాద్: బాలకృష్ణ సినీ పరిశ్రమలోకి వచ్చి 50 పూర్తయిన సందర్భంగా తెలుగు సినీ పరిశ్రమ గ్రాండ్ గా సెలబ్రేషన్స్ నిర్వహిస్తుంది. 1974లో తాతమ్మ కల సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు బాలయ్య. 50 ఏళ్ళ తన నట ప్రస్థానం పూర్తవడంతో అన్ని సినీ పరిశ్రమల నుంచి స్టార్స్ ని పిలిచి ఈవెంట్ గ్రాండ్ గా చేస్తున్నారు.
బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకల ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. చిరంజీవి బాలకృష్ణని హత్తుకొని శుభాకాంక్షలు తెలిపారు. ఇద్దరూ ఈవెంట్లో పక్కపక్కనే కూర్చుకున్నారు. ఇండస్ట్రీ సీనియర్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నటసింహం బాలకృష్ణ ఇలా కలిసి ఒకేచోట కనపడటంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి అయ్యప్ప మాలలో రావడం గమనార్హం.
అలాగే చిరంజీవితో పాటు ఈ ఈవెంట్ కి వెంకటేష్, శ్రీకాంత్, నాని, కన్నడ స్టార్ హీరోలు శివన్న, ఉపేంద్ర, మన సినీ పరిశ్రమ నుంచి ఎంతోమంది నటీనటులు, డైరెక్టర్స్ విచ్చేసారు.ఈ ఈవెంట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరుగుతుంది. ప్రస్తుతం ఈ ఈవెంట్ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









