కండలు కరిగేలా కసరత్తులు చేస్తున్నారా.? ఫుడ్ విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి సుమీ.!
- September 02, 2024
ఫిట్గా వుండాలంటే కొన్ని రకాల వ్యాయామాలు చేయాల్సి వుంటుంది. చిన్న చిన్న ఎక్సర్సైజులు కావొచ్చు.. అలాగే భారీ కసరత్తులు కావచ్చు. ఎలాంటి వ్యాయామాలు చేసినా వాటితో పాటూ డైట్ కేరింగ్ కూడా అత్యవసరం.
వ్యాయామానికి ముందూ ఆ తర్వాత కూడా కొన్ని రకాల ఫుడ్ కేరింగ్స్ తీసుకోవాలి. వ్యాయామానికి ముందు ప్రొటీన్స్ ఎక్కువగా వున్న ఫుడ్ తీసుకోవాలి. అలాగే, ఫైబర్, ఫ్యాట్స్ వున్న ఫుడ్ కూడా భాగం చేసుకోవాలి.
ఉడికించిన గుడ్డు, అరటి పండు వంటి ఆహారం వ్యాయామానికి ముందు తీసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు.
అలాగే, తిన్న తర్వాత గంట సమయం తీసుకున్నాకే వ్యాయామానికి సన్నద్ధం కావాలి. గంట లోపు వ్యాయామం చేస్తే అనవసరమైన అనారోగ్య సమస్యలొస్తాయని హెచ్చరిస్తున్నారు.
అలాగే వ్యాయామం తర్వాత రాగి మాల్ట్, మొలకెత్తిన గింజలు తదితర ఆహారాల్ని కంపల్సరీ తీసుకోవడంతో పాటూ రెగ్యులర్ ఫుడ్ తీసుకోవచ్చు.
అతిగా బరువులు గట్రా మోసే వ్యాయామాలు చేసే వారు చేపలు, చికెన్, గుడ్లు వంటి ప్రొటీన్స్ ఎక్కువగా వున్న ఆహార పదార్ధాలు.. అలాగే పాలు, పెరుగు వంటి కార్భొహైడ్రేట్స్ వున్న ఆహార పదార్ధాల్నివాటితో పాటూ మంచి పోషకాలున్న డైట్ తీసుకోవాలి.
నీరు ఎక్కువగా తీసుకోవాలి. వ్యాయామం చేసేటప్పుడు చెమట రూపంలో శరీరం నుంచి ఎక్కువగా వాటర్ బయటకి పోతుంది. అందుకే కావల్సినంత వాటర్ కంటెంట్ శరీరానికి అందిస్తూ వుండాలి. ఈ జాగ్రత్తలు పాటిస్తూ వ్యాయామం చేసేవారిలో ఎలాంటి అనారోగ్య సమస్యల్లేకుండా ఫిట్గా వుండే అవకాశముంటుంది.
తాజా వార్తలు
- న్యూయార్క్ టైమ్స్ నివేదికను ఖండించిన సౌదీ అరేబియా..!!
- ఈద్ అల్ ఫితర్: యూఏఈ సూపర్ మార్కెట్లలో కొనుగోళ్ల సందడి..!!
- ప్రమాదకరమైన జంతువుల చట్టం పై షురా కౌన్సిల్ సమీక్ష..!!
- సౌదీలో బయటపడ్డ 13,500 ఏళ్ల నాటి మానవ నివాసం..!!
- కువైట్ లో 16 మంది హిజ్బుల్లా అనుబంధ సభ్యులు అరెస్ట్..!!
- అల్ తుమామా స్టేడియం ఇంటర్చేంజ్ రోడ్ మూసివేత..!!
- బని యాస్ ప్రాంతంలో పాకిస్తానీ ప్రవాసి మృతి..అబుదాబి
- విశాఖకు సెమీ రింగ్ రోడ్!
- మార్చి 20న అసెంబ్లీకి తెలంగాణ బడ్జెట్
- ఏసీ టూరిస్ట్ రైల్లో శ్రీ రామాయణ యాత్ర..మార్చి 30న ప్రారంభం..









