ఒమన్-ఇండియా బిజినెస్ ఫోరమ్.. పెట్టుబడి అవకాశాలకు పిలుపు..!

- September 04, 2024 , by Maagulf
ఒమన్-ఇండియా బిజినెస్ ఫోరమ్.. పెట్టుబడి అవకాశాలకు పిలుపు..!

మస్కట్‌: ఒమన్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ (OCCI) ఆధ్వర్యంలో ఒమన్‌-ఇండియా బిజినెస్‌ ఫోరమ్‌ మస్కట్‌లో జరిగింది. వాణిజ్య రంగాలలో రెండు దేశాల మధ్య ఉమ్మడి పెట్టుబడి అవకాశాలను ఫోరమ్ సమీక్షించింది. ఆహార భద్రత, బిల్డింగ్ మెటీరియల్స్, పెట్రోలియం మరియు ఫార్మాస్యూటికల్ ఉత్పత్తులు, ఆభరణాలు, టెక్స్‌టైల్ మరియు ప్లాస్టిక్ పరిశ్రమలు వంటి కీలక రంగాలలో పెట్టుబడి అవకాశాలను అన్వేషించడానికి ఒమానీ, భారతీయ కంపెనీలకు ఫోరమ్ వేదికగా ఉందని OCCI బోర్డు సభ్యుడు ఇంజి. రిధా జుమా అల్ సలేహ్ తెలిపారు.

రెండు దేశాలు ఇటీవల ద్వైపాక్షిక వాణిజ్యంలో గణనీయమైన వృద్ధిని సాధించాయని, సమగ్ర ఆర్థిక భాగస్వామ్యాన్ని అభివృద్ధి చేయడంలో నిమగ్నమై ఉన్నాయని అల్ సలేహ్ తెలిపారు. 2024 చివరి నాటికి ద్వైపాక్షిక వాణిజ్య మార్పిడి విలువ RO 1.2 బిలియన్ ($3.1 బిలియన్) వద్ద ఉందని ఆయన స్పష్టం చూపారు. పెట్టుబడి అవకాశాలను అంచనా వేయడం వంటి చర్యలపై చర్చించడానికి ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించినట్లు అల్ సలేహ్ చెప్పారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com