ఒమన్-ఇండియా బిజినెస్ ఫోరమ్.. పెట్టుబడి అవకాశాలకు పిలుపు..!
- September 04, 2024
మస్కట్: ఒమన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (OCCI) ఆధ్వర్యంలో ఒమన్-ఇండియా బిజినెస్ ఫోరమ్ మస్కట్లో జరిగింది. వాణిజ్య రంగాలలో రెండు దేశాల మధ్య ఉమ్మడి పెట్టుబడి అవకాశాలను ఫోరమ్ సమీక్షించింది. ఆహార భద్రత, బిల్డింగ్ మెటీరియల్స్, పెట్రోలియం మరియు ఫార్మాస్యూటికల్ ఉత్పత్తులు, ఆభరణాలు, టెక్స్టైల్ మరియు ప్లాస్టిక్ పరిశ్రమలు వంటి కీలక రంగాలలో పెట్టుబడి అవకాశాలను అన్వేషించడానికి ఒమానీ, భారతీయ కంపెనీలకు ఫోరమ్ వేదికగా ఉందని OCCI బోర్డు సభ్యుడు ఇంజి. రిధా జుమా అల్ సలేహ్ తెలిపారు.
రెండు దేశాలు ఇటీవల ద్వైపాక్షిక వాణిజ్యంలో గణనీయమైన వృద్ధిని సాధించాయని, సమగ్ర ఆర్థిక భాగస్వామ్యాన్ని అభివృద్ధి చేయడంలో నిమగ్నమై ఉన్నాయని అల్ సలేహ్ తెలిపారు. 2024 చివరి నాటికి ద్వైపాక్షిక వాణిజ్య మార్పిడి విలువ RO 1.2 బిలియన్ ($3.1 బిలియన్) వద్ద ఉందని ఆయన స్పష్టం చూపారు. పెట్టుబడి అవకాశాలను అంచనా వేయడం వంటి చర్యలపై చర్చించడానికి ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించినట్లు అల్ సలేహ్ చెప్పారు.
తాజా వార్తలు
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …
- షార్జా రాజ కుటుంబంలో విషాదం
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!
- బంగ్లాదేశీయులపై యూఏఈ వీసా నిషేధం? నిజమెంత?
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..