1800 కంపెనీలు..3 వారాల్లో 352 ఉల్లంఘనలు..!
- September 05, 2024
యూఏఈ: యూఏఈలో 1.5 మిలియన్ల మంది కార్మికులు లేబర్ వసతి గృహాలలో నివసిస్తున్నారని అధికారులు వెల్లడించారు. మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ అండ్ ఎమిరేటైజేషన్ (MoHRE) ఎలక్ట్రానిక్ లేబర్ అకామోడేషన్ సిస్టమ్లో 1,800 కంటే ఎక్కువ కంపెనీలు నమోదు అయినట్లు తెలిపారు. కార్మికుల నివాస సౌకర్యాలలో 352 ఉల్లంఘనలను గుర్తించినట్టు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉల్లంఘనలలో వెంటిలేషన్ లేకపోవడం, ఎయిర్ కండిషనింగ్, పారిశుధ్య అవసరాలను తీర్చడంలో వైఫల్యం, సాధారణ పరిశుభ్రత సమస్యలు ఉన్నాయి. మే 20 నుంచి జూన్ 7వ తేదీ వరకు జరిగిన తనిఖీల అనంతరం నిబంధనలు పాటించని కొన్ని కంపెనీలను హెచ్చరించినట్టు MoHRE తనిఖీ వ్యవహారాల అసిస్టెంట్ అండర్ సెక్రటరీ మొహ్సిన్ అలీ అల్ నస్సీ వెల్లడించారు. లేబర్ క్యాంపులలో శుభ్రమైన, చల్లటి నీటి సరఫరా, బెడ్రూమ్ మరియు వాష్రూమ, పారిశుద్ధ్య సేవలు, కార్మికులకు ఒక్కొక్కరికి కనీసం మూడు చదరపు మీటర్ల స్థలం అందుబాటులో ఉండాలన్నారు. లేబర్ వసతి ఆరోగ్యం, సౌకర్యం మరియు పరిశుభ్రత ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా ఇన్స్పెక్టర్లు నిర్ధారిస్తారని తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఆన్లైన్ ట్రేడింగ్ స్కామ్లకు బలవుతున్న ఇన్వెస్టర్లు..!!
- ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి.. తీవ్రంగా ఖండించిన ఒమన్..!!
- సార్ కారు ప్రమాదం.. మూడుకు చెరిన మృతుల సంఖ్య..!!
- స్పెషల్ ఆపరేషన్.. ఖైతాన్లో 20 మంది ప్రవాసులు అరెస్టు..!!
- యూఏఈ ఉద్దేశపూర్వకంగా 3 నౌకలను ఎందుకు ముంచివేసిందంటే..!!
- సౌదీ అరేబియాలో 2,400 మందికి పైగా స్మగ్లర్లు అరెస్టు..!!
- ఈ కార్ రేసు కేసులో కెటిఆర్ కు ఎసిబి పిలుపు
- మొబైల్ వినియోగదారులకి టెలికాం శాఖ గుడ్ న్యూస్
- హైదరాబాద్ లో రెచ్చిపోతున్న రాజస్థాన్ దొంగలు
- ఇరాన్పై ఇజ్రాయెల్ వార్..ముడి చమురు ధరలకు రెక్కలు!