ఒమన్ లో పెట్టుబడి అవకాశాల పై భారత బృందం ఫోకస్..!
- September 05, 2024
సోహర్: నార్త్ అల్ బతినా గవర్నరేట్లోని ఒమన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (OCCI) శాఖ ఇండియా నుండి వ్యాపార ప్రతినిధి బృందంతో సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఒమన్ లో పర్యటిస్తున్న భారత ప్రతినిధి బృందంలో 30 మంది వ్యాపారవేత్తలు ఉన్నారు.ఈ సమావేశంలో ఆహార పదార్థాలు, వ్యవసాయం, నిర్మాణ వస్తువులు, సౌందర్య సాధనాలు, ఔషధం, ప్లాస్టిక్లు, వస్త్రాలు, పెట్రోలియం ఉత్పత్తులు, ఆభరణాలు వంటి వివిధ రంగాలలో వ్యాపార భాగస్వామ్యాన్ని నెలకొల్పడం లక్ష్యంగా పెట్టుకున్నారు. వాణిజ్య సహకారాన్ని విస్తరించడం, నైపుణ్యం మరియు సమాచారాన్ని పరస్పరం షేర్ చేసుకోవడం, ఉమ్మడి పెట్టుబడి అవకాశాలను అన్వేషించడం కోసం ఒమన్ –ఇండియాకు చెందిన వ్యాపారవేత్తల మధ్య B2B సమావేశాలు జరిగాయని ఒమన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీకి చెందిన నార్త్ అల్ బతినా గవర్నరేట్ బ్రాంచ్ డైరెక్టర్ల బోర్డు ఛైర్మన్ సయీద్ బిన్ అలీ అల్ అబ్రి తెలిపారు. ఒమన్, ఇండియా మధ్య వాణిజ్య మార్పిడి గత చివరి నాటికి $3 బిలియన్లకు చేరుకుందన్నారు. ఆర్థిక సంబంధాలను పటిష్టం చేయడం, మల్టీ వాణిజ్య రంగాలలో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని అభివృద్ధి చేయడం గురించి ప్రతినిధుల బృందాలు చర్చిస్తున్నాయని వెల్లడించారు. రెండు దేశాల మధ్య ఆర్థిక భాగస్వామ్యం పెరుగుతుందని పేర్కొన్నారు. భారతీయ ఎగుమతి సంస్థల ప్రాంతీయ సమాఖ్య అధ్యక్షుడు, భారత ప్రతినిధి బృందం అధిపతి పరేష్ మెహతా మాట్లాడుతూ.. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంపొందించడానికి, రెండు దేశాల ఆర్థిక ప్రయోజనాలను అందించడానికి పెట్టుబడి అవకాశాలను సృష్టించడానికి ఇండియా శ్రద్ధగా కృషి చేస్తోందన్నారు.
తాజా వార్తలు
- గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఇండెక్స్..8వ స్థానంలో ఒమన్..!!
- అమీర్ భారత్ పర్యటన విజయవంతం..!!
- సౌదీలో ముగ్గురు విదేశీయులు అరెస్ట్..!!
- శిథిల భవనాల కోసం అత్యవసర టాస్క్ఫోర్స్.. ఎంపీలు ఆమోదం..!!
- Dh1 స్కామ్: ఏఐతో వేలాది దిర్హామ్స్ కోల్పోయిన బాధితులు..!!
- అంతరాష్ట్ర ఎన్.డి.పి.ఎల్ సరఫరా చైన్ భగ్నం
- కువైట్ లో తీవ్రమైన పార్కింగ్ కొరత..అధ్యయనం..!!
- పామర్రు జనసేన పార్టీ శ్రేణులతో బండిరామకృష్ణ సమావేశం
- ప్రతి బింబాలు కథా సంపుటి ఆవిష్కరణ
- శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహోత్సవాలు ప్రారంభం