ఒమన్ లో పెట్టుబడి అవకాశాల పై భారత బృందం ఫోకస్..!
- September 05, 2024
సోహర్: నార్త్ అల్ బతినా గవర్నరేట్లోని ఒమన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (OCCI) శాఖ ఇండియా నుండి వ్యాపార ప్రతినిధి బృందంతో సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఒమన్ లో పర్యటిస్తున్న భారత ప్రతినిధి బృందంలో 30 మంది వ్యాపారవేత్తలు ఉన్నారు.ఈ సమావేశంలో ఆహార పదార్థాలు, వ్యవసాయం, నిర్మాణ వస్తువులు, సౌందర్య సాధనాలు, ఔషధం, ప్లాస్టిక్లు, వస్త్రాలు, పెట్రోలియం ఉత్పత్తులు, ఆభరణాలు వంటి వివిధ రంగాలలో వ్యాపార భాగస్వామ్యాన్ని నెలకొల్పడం లక్ష్యంగా పెట్టుకున్నారు. వాణిజ్య సహకారాన్ని విస్తరించడం, నైపుణ్యం మరియు సమాచారాన్ని పరస్పరం షేర్ చేసుకోవడం, ఉమ్మడి పెట్టుబడి అవకాశాలను అన్వేషించడం కోసం ఒమన్ –ఇండియాకు చెందిన వ్యాపారవేత్తల మధ్య B2B సమావేశాలు జరిగాయని ఒమన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీకి చెందిన నార్త్ అల్ బతినా గవర్నరేట్ బ్రాంచ్ డైరెక్టర్ల బోర్డు ఛైర్మన్ సయీద్ బిన్ అలీ అల్ అబ్రి తెలిపారు. ఒమన్, ఇండియా మధ్య వాణిజ్య మార్పిడి గత చివరి నాటికి $3 బిలియన్లకు చేరుకుందన్నారు. ఆర్థిక సంబంధాలను పటిష్టం చేయడం, మల్టీ వాణిజ్య రంగాలలో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని అభివృద్ధి చేయడం గురించి ప్రతినిధుల బృందాలు చర్చిస్తున్నాయని వెల్లడించారు. రెండు దేశాల మధ్య ఆర్థిక భాగస్వామ్యం పెరుగుతుందని పేర్కొన్నారు. భారతీయ ఎగుమతి సంస్థల ప్రాంతీయ సమాఖ్య అధ్యక్షుడు, భారత ప్రతినిధి బృందం అధిపతి పరేష్ మెహతా మాట్లాడుతూ.. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంపొందించడానికి, రెండు దేశాల ఆర్థిక ప్రయోజనాలను అందించడానికి పెట్టుబడి అవకాశాలను సృష్టించడానికి ఇండియా శ్రద్ధగా కృషి చేస్తోందన్నారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







