73 ఏళ్ల భారతీయ ప్రవాసుడి జీవితంలో వెలుగులు నింపిన క్షమాభిక్ష పథకం..!
- September 05, 2024
యూఏఈ: రెండు నెలల క్షమాభిక్ష కార్యక్రమంలో చాలా మంది అక్రమ నివాసితులు తమ వీసా స్థితిని సరిదిద్దడానికి ముందుకు వచ్చారు. క్లిష్టపరిస్థితుల్లో వారికి ఊపిరి పోసింది. ప్రతికూల జీవిత పరిస్థితులు 73 ఏళ్ల భారతీయ ప్రవాస అలీని ఐదేళ్ల క్రితం దుబాయ్కి రప్పించింది. "నేను 1992 నుండి కొన్ని సంవత్సరాల క్రితం వరకు యూఏఈలో పనిచేశాను." అని మమ్జార్లోని అమెర్ సెంటర్లో తెలిపాడు. “కానీ నా రెండవ కొడుకు ప్రమాదానికి గురయ్యాడు. మాట్లాడే సామర్థ్యాన్ని తిరిగి పొందడానికి అతనికి ఆపరేషన్ అవసరం. కాబట్టి, ఆ ఆపరేషన్ కోసం డబ్బు సంపాదించడానికి నేను యూఏఈకి తిరిగి రావలసి వచ్చింది.” అని చెప్పారు.
కుక్గా అతని మొదటి వర్క్ వీసా గడువు ముగిసిన తర్వాత మరొక కుటుంబం నియమించుకుందని తెలిపారు. తన వయస్సు కారణంగా వీసా తిరస్కరించారని అలీ చెప్పారు. ఒక సంవత్సరం తర్వాత వాళ్లు కూడా తొలగించడంతో రోడ్డున పడినట్టు వాపోయాడు. అలీ కూలి పనులు చేస్తూ ఎక్కువ సమయం మసీదులో గడిపేవాడు. తన ఆరోగ్యం పాడయిందని, అందుకే పని చేయలేకపోయినట్టు పేర్కొన్నారు. ఇప్పుడు తాను ఇంటికి వెళ్లి తన ప్రజలను చూడాలనుకుంటున్నట్టు తెలిపారు. అలీకి అవుట్పాస్ జారీ అయింది. యునైటెడ్ PRO అసోసియేషన్ అని పిలువబడే పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (PRO) బృందం అతనికి ఇంటికి వెళ్లేందుకు ఉచిత టిక్కెట్ను అందజేసింది.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









