73 ఏళ్ల భారతీయ ప్రవాసుడి జీవితంలో వెలుగులు నింపిన క్షమాభిక్ష పథకం..!
- September 05, 2024
యూఏఈ: రెండు నెలల క్షమాభిక్ష కార్యక్రమంలో చాలా మంది అక్రమ నివాసితులు తమ వీసా స్థితిని సరిదిద్దడానికి ముందుకు వచ్చారు. క్లిష్టపరిస్థితుల్లో వారికి ఊపిరి పోసింది. ప్రతికూల జీవిత పరిస్థితులు 73 ఏళ్ల భారతీయ ప్రవాస అలీని ఐదేళ్ల క్రితం దుబాయ్కి రప్పించింది. "నేను 1992 నుండి కొన్ని సంవత్సరాల క్రితం వరకు యూఏఈలో పనిచేశాను." అని మమ్జార్లోని అమెర్ సెంటర్లో తెలిపాడు. “కానీ నా రెండవ కొడుకు ప్రమాదానికి గురయ్యాడు. మాట్లాడే సామర్థ్యాన్ని తిరిగి పొందడానికి అతనికి ఆపరేషన్ అవసరం. కాబట్టి, ఆ ఆపరేషన్ కోసం డబ్బు సంపాదించడానికి నేను యూఏఈకి తిరిగి రావలసి వచ్చింది.” అని చెప్పారు.
కుక్గా అతని మొదటి వర్క్ వీసా గడువు ముగిసిన తర్వాత మరొక కుటుంబం నియమించుకుందని తెలిపారు. తన వయస్సు కారణంగా వీసా తిరస్కరించారని అలీ చెప్పారు. ఒక సంవత్సరం తర్వాత వాళ్లు కూడా తొలగించడంతో రోడ్డున పడినట్టు వాపోయాడు. అలీ కూలి పనులు చేస్తూ ఎక్కువ సమయం మసీదులో గడిపేవాడు. తన ఆరోగ్యం పాడయిందని, అందుకే పని చేయలేకపోయినట్టు పేర్కొన్నారు. ఇప్పుడు తాను ఇంటికి వెళ్లి తన ప్రజలను చూడాలనుకుంటున్నట్టు తెలిపారు. అలీకి అవుట్పాస్ జారీ అయింది. యునైటెడ్ PRO అసోసియేషన్ అని పిలువబడే పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (PRO) బృందం అతనికి ఇంటికి వెళ్లేందుకు ఉచిత టిక్కెట్ను అందజేసింది.
తాజా వార్తలు
- భారతీయుల కోసం ప్రత్యేక హెల్ప్లైన్ నంబర్లు
- సైనిక ప్రతీకారం 'కచ్చితంగా' చర్చకు వస్తుంది: యూఏఈ అధ్యక్షుడి దౌత్య సలహాదారు అన్వర్ గార్గాష్
- భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
- టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడికి హైదరాబాద్ కోర్టులో ఊరట
- తెలంగాణ లో మహిళా పెట్రోల్ బంకులు
- ఇద్దరు ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్ సెల్స్ అరెస్ట్: ఖతార్
- 166 మిస్సైల్స్, డ్రోన్లను ధ్వంసం చేశాం: బహ్రెయిన్
- కువైట్ పై దాడులకు తెగబడ్డ ఇరాన్..!!
- కువైట్లో సైనికుల మృతి పట్ల ఒమన్ సంతాపం..!!
- దౌత్యాధికారులకు ఇఫ్తార్ విందు ఇచ్చిన సౌదీ అరేబియా..!!









