73 ఏళ్ల భారతీయ ప్రవాసుడి జీవితంలో వెలుగులు నింపిన క్షమాభిక్ష పథకం..!
- September 05, 2024
యూఏఈ: రెండు నెలల క్షమాభిక్ష కార్యక్రమంలో చాలా మంది అక్రమ నివాసితులు తమ వీసా స్థితిని సరిదిద్దడానికి ముందుకు వచ్చారు. క్లిష్టపరిస్థితుల్లో వారికి ఊపిరి పోసింది. ప్రతికూల జీవిత పరిస్థితులు 73 ఏళ్ల భారతీయ ప్రవాస అలీని ఐదేళ్ల క్రితం దుబాయ్కి రప్పించింది. "నేను 1992 నుండి కొన్ని సంవత్సరాల క్రితం వరకు యూఏఈలో పనిచేశాను." అని మమ్జార్లోని అమెర్ సెంటర్లో తెలిపాడు. “కానీ నా రెండవ కొడుకు ప్రమాదానికి గురయ్యాడు. మాట్లాడే సామర్థ్యాన్ని తిరిగి పొందడానికి అతనికి ఆపరేషన్ అవసరం. కాబట్టి, ఆ ఆపరేషన్ కోసం డబ్బు సంపాదించడానికి నేను యూఏఈకి తిరిగి రావలసి వచ్చింది.” అని చెప్పారు.
కుక్గా అతని మొదటి వర్క్ వీసా గడువు ముగిసిన తర్వాత మరొక కుటుంబం నియమించుకుందని తెలిపారు. తన వయస్సు కారణంగా వీసా తిరస్కరించారని అలీ చెప్పారు. ఒక సంవత్సరం తర్వాత వాళ్లు కూడా తొలగించడంతో రోడ్డున పడినట్టు వాపోయాడు. అలీ కూలి పనులు చేస్తూ ఎక్కువ సమయం మసీదులో గడిపేవాడు. తన ఆరోగ్యం పాడయిందని, అందుకే పని చేయలేకపోయినట్టు పేర్కొన్నారు. ఇప్పుడు తాను ఇంటికి వెళ్లి తన ప్రజలను చూడాలనుకుంటున్నట్టు తెలిపారు. అలీకి అవుట్పాస్ జారీ అయింది. యునైటెడ్ PRO అసోసియేషన్ అని పిలువబడే పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (PRO) బృందం అతనికి ఇంటికి వెళ్లేందుకు ఉచిత టిక్కెట్ను అందజేసింది.
తాజా వార్తలు
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!
- మస్కట్ మునిసిపాలిటీ చేతికి ఒమన్ బొటానిక్ గార్డెన్..!!
- షేక్ తమీమ్ అవార్డుల విజేతలను సత్కరించిన అమీర్..!!
- 14 రోజుల్లో 21 ఆస్తులకు విద్యుత్ నిలిపివేత..!!
- యూఏఈలో తొలి లైసెన్స్ స్పోర్ట్స్ బెట్టింగ్ పోర్టల్..!!
- ప్రారంభమైన హెచ్ 1బీ, సోషల్ మీడియా స్క్రీనింగ్..







