73 ఏళ్ల భారతీయ ప్రవాసుడి జీవితంలో వెలుగులు నింపిన క్షమాభిక్ష పథకం..!
- September 05, 2024
యూఏఈ: రెండు నెలల క్షమాభిక్ష కార్యక్రమంలో చాలా మంది అక్రమ నివాసితులు తమ వీసా స్థితిని సరిదిద్దడానికి ముందుకు వచ్చారు. క్లిష్టపరిస్థితుల్లో వారికి ఊపిరి పోసింది. ప్రతికూల జీవిత పరిస్థితులు 73 ఏళ్ల భారతీయ ప్రవాస అలీని ఐదేళ్ల క్రితం దుబాయ్కి రప్పించింది. "నేను 1992 నుండి కొన్ని సంవత్సరాల క్రితం వరకు యూఏఈలో పనిచేశాను." అని మమ్జార్లోని అమెర్ సెంటర్లో తెలిపాడు. “కానీ నా రెండవ కొడుకు ప్రమాదానికి గురయ్యాడు. మాట్లాడే సామర్థ్యాన్ని తిరిగి పొందడానికి అతనికి ఆపరేషన్ అవసరం. కాబట్టి, ఆ ఆపరేషన్ కోసం డబ్బు సంపాదించడానికి నేను యూఏఈకి తిరిగి రావలసి వచ్చింది.” అని చెప్పారు.
కుక్గా అతని మొదటి వర్క్ వీసా గడువు ముగిసిన తర్వాత మరొక కుటుంబం నియమించుకుందని తెలిపారు. తన వయస్సు కారణంగా వీసా తిరస్కరించారని అలీ చెప్పారు. ఒక సంవత్సరం తర్వాత వాళ్లు కూడా తొలగించడంతో రోడ్డున పడినట్టు వాపోయాడు. అలీ కూలి పనులు చేస్తూ ఎక్కువ సమయం మసీదులో గడిపేవాడు. తన ఆరోగ్యం పాడయిందని, అందుకే పని చేయలేకపోయినట్టు పేర్కొన్నారు. ఇప్పుడు తాను ఇంటికి వెళ్లి తన ప్రజలను చూడాలనుకుంటున్నట్టు తెలిపారు. అలీకి అవుట్పాస్ జారీ అయింది. యునైటెడ్ PRO అసోసియేషన్ అని పిలువబడే పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (PRO) బృందం అతనికి ఇంటికి వెళ్లేందుకు ఉచిత టిక్కెట్ను అందజేసింది.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







