ఇక ఐదు రోజుల్లోనే పాస్పోర్టు రెన్యువల్!
- June 19, 2016
సౌదీలోని భారతీయులకు ఇది శుభవార్తే. పాస్పోర్టు రెన్యువల్ కోసం ఇక రోజుల తరబడి ఎదురుచూడాల్సిన పనిలేదు. ఇక నుంచి ఐదంటే ఐదు రోజుల్లోనే పాస్పోర్టును రెన్యువల్ చేయనున్నట్టు భారత దౌత్య అధికారులు పేర్కొన్నారు. యూఏఈలోని ఇండియన్ పాస్పోర్టు అథారిటీతోపాటు ఇతర దేశాల్లో జారీ చేసిన పాస్పోర్టులను రెన్యువల్ చేయించుకునేందుకు గతంలో 40 పనిదినాలు పట్టేది. అయితే ఇక నుంచి ఆ వ్యవధిని తగ్గించి కేవలం ఐదు రోజుల్లోనే పాస్పోర్టులను రెన్యువల్ చేయాలని యూఏఈలోని భారత దౌత్య కార్యాలయ అధికారులు భావిస్తున్నారు. అబుధాబి నివాసులకు కూడా ఇదే వర్తిస్తుంది. ''ఐదు రోజుల్లోనే పాస్పోర్టులను రెన్యువల్ చేసి ఇవ్వాలని భావిస్తున్నాం.ఈ నెల నుంచే దీనిని ప్రారంభించాలనుకుంటున్నాం'' అని యూఏఈలో భారత రాయబారి టీపీ సీతారామన్ పేర్కొన్నారు. ఇండియాతో పాటు ఇతర దేశాల్లోని ఇండియన్ పాస్పోర్టు అథారిటీ జారీ చేసిన అన్ని పాస్పోర్టులకు ఇది వర్తిస్తుందని ఆయన తెలిపారు. సీతారామన్ ప్రకటనతో భారత వలసదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!









