ఇక ఐదు రోజుల్లోనే పాస్పోర్టు రెన్యువల్!
- June 19, 2016
సౌదీలోని భారతీయులకు ఇది శుభవార్తే. పాస్పోర్టు రెన్యువల్ కోసం ఇక రోజుల తరబడి ఎదురుచూడాల్సిన పనిలేదు. ఇక నుంచి ఐదంటే ఐదు రోజుల్లోనే పాస్పోర్టును రెన్యువల్ చేయనున్నట్టు భారత దౌత్య అధికారులు పేర్కొన్నారు. యూఏఈలోని ఇండియన్ పాస్పోర్టు అథారిటీతోపాటు ఇతర దేశాల్లో జారీ చేసిన పాస్పోర్టులను రెన్యువల్ చేయించుకునేందుకు గతంలో 40 పనిదినాలు పట్టేది. అయితే ఇక నుంచి ఆ వ్యవధిని తగ్గించి కేవలం ఐదు రోజుల్లోనే పాస్పోర్టులను రెన్యువల్ చేయాలని యూఏఈలోని భారత దౌత్య కార్యాలయ అధికారులు భావిస్తున్నారు. అబుధాబి నివాసులకు కూడా ఇదే వర్తిస్తుంది. ''ఐదు రోజుల్లోనే పాస్పోర్టులను రెన్యువల్ చేసి ఇవ్వాలని భావిస్తున్నాం.ఈ నెల నుంచే దీనిని ప్రారంభించాలనుకుంటున్నాం'' అని యూఏఈలో భారత రాయబారి టీపీ సీతారామన్ పేర్కొన్నారు. ఇండియాతో పాటు ఇతర దేశాల్లోని ఇండియన్ పాస్పోర్టు అథారిటీ జారీ చేసిన అన్ని పాస్పోర్టులకు ఇది వర్తిస్తుందని ఆయన తెలిపారు. సీతారామన్ ప్రకటనతో భారత వలసదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







