బాధాకరం.. స్కూల్ బ్యాగుల గురించి పేరెంట్స్ ఆందోళన..!
- September 06, 2024
యూఏఈ: చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల బరువైన బ్యాక్ప్యాక్ల గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్కువ పుస్తకాలను తీసుకెళ్లడానికి పాఠశాలలను అనుమతించాలని కోరారు. పాఠశాలలు తరచుగా విశాలమైన క్యాంపస్లను కలిగి ఉన్నాయని, విద్యార్థులు ఎక్కువ దూరం నడవడం లేదా మెట్లు ఎక్కడం జరుగుతుందని, దీంతో పిల్లలపై అదనపు భారం పడుతుందని పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వైద్యులు సిఫార్సు చేయబడిన బరువు పరిమితిని మించి బ్యాగులను మోయడం వల్ల శారీరక ఆరోగ్యానికి, పిల్లల మొత్తం శ్రేయస్సుకు కూడా ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. ఇది వారి అకడమిక్ పనితీరును మాత్రమే కాకుండా వారి దీర్ఘకాలిక అభివృద్ధిని కూడా ప్రభావితం చేస్తుందని వారు హెచ్చరిస్తున్నారు. పిల్లల బ్యాక్ప్యాక్ వారి శరీర బరువులో 20 శాతానికి మించకూడదని వైద్యులు కూడా సిఫార్సు చేస్తున్నారు.
ఇదే విషయమై పలువురు పేరెంట్స్ సోషల్ మీడియా వేదికగా తమ పిల్లల కష్టాలను పంచుకున్నారు. "నేను నా 8 ఏళ్ల కొడుకు బ్యాగ్ని ఎత్తినప్పుడు నాకు బాధ కలుగుతుంది. అతను రోజూ ఈ బరువునంతా మోయాలి. పాఠశాలలో ఎలివేటర్ ఉండగా, వైద్యపరిస్థితుల్లో ఉన్న విద్యార్థులకే దాని వినియోగాన్ని పరిమితం చేసారు.’’అని ఒక ఎమిరాటీ తల్లి అమ్నా అల్ హమ్మదీ ఆవేదన వ్యక్తం చేశారు. మరో పేరెంట్ మునా మహ్మద్ తన 9 ఏళ్ల కూతురు పడుతున్న ఇబ్బందుల గురించి చెప్పింది. "నా కుమార్తె తన బ్యాగ్ని మెట్లు పైకి తీయడం చాలా కష్టంగా ఉంది. గత వారం, ఆమె చేతులు మరియు కాళ్ళలో నొప్పిగా ఉందని చెప్పింది. చిన్న శరీరాలు ఉన్న పిల్లలు ఇంత భారీ బరువును మోయవలసి రావాడం దారుణం. అది వారికి నొప్పిని కలిగిస్తుంది." అని వాపోయారు. ఇంటర్నేషనల్ మోడ్రన్ హాస్పిటల్ దుబాయ్లోని శిశువైద్యుడు, నియోనాటాలజిస్ట్ డాక్టర్ మమతా బోత్రా మాట్లాడుతూ..బరువైన బ్యాగులను మోయడం వల్ల మెడ, వెన్నునొప్పి, భుజం నొప్పి వస్తుందన్నారు. భుజంపై బ్యాగ్ని మోయడం వల్ల చేయి ఒత్తిడికి గురవుతుందని, అలాగే బిగుతుగా ఉండే పట్టీలు చేతుల్లో తిమ్మిరి, జలదరింపు మరియు బలహీనతకు కారణమవుతాయని డాక్టర్ బోత్రా సూచించారు. ఈ సమస్యలను పరిష్కరించకపోతే ఇవి దీర్ఘకాలిక సమస్యలకు దారి తీస్తుందని హెచ్చరించారు.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









