నైజీరియాలో ఘోర ప్రమాదం..48 మంది మృతి
- September 09, 2024
నైజీరియా: నైజీరియాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఇంధన ట్యాంకర్, ట్రక్కు ఢీకొన్న ఘటనలో 48 మంది మరణించినట్లు ఆ దేశ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఏజెన్సీ తెలిపింది. మరో 50 వరకు పశువులు మృతి చెందాయి. ఈ విషయాన్ని ఆ దేశ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. ఈ ఏడాదిలో అక్కడ జరిగిన ఘటనల్లో ఇదే అతిపెద్దది.
నైజీరియాలో నార్త్- మధ్య నైజర్ రాష్ట్రంలోని ఆగాయి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఓ ఆయిల్ ట్యాంకర్ ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీ కొట్టింది. ఈ ఘటనలో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఈ మంటలు చుట్టుపక్కన వాహనా లకు అట్టుకున్నాయి. ట్రక్కులో ఉన్న 50 పశువులు సజీవ దహనమయ్యాయి. ఈ ప్రమాదంలో 48 మంది మృతి చెందారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు వేగంగా జరుగుతున్నాయి. మొదట్లో 30 మంది సజీవ దహనమయ్యారు. మరో 18 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి.
మృతులకు సమీపంలోని ఓ ప్రాంతంలో సామూహిక అంత్యక్రియలు నిర్వహించినట్టు పేర్కొంది. నైజీరియాలో సరైన రైల్వే వ్యవస్థ లేదు. ముఖ్యంగా కార్గో రవాణాకు కేవలం వాహనాలు మాత్రమే వినియోగిస్తున్నారు. ఆఫ్రికాలో అత్యధిక జనాబా కలిగిన నైజీరియాలో ఆ తరహా ప్రమాదాలు సాధారణంగా చెబుతున్నారు. 2020లో 1,531 ప్రమాదాలు జరగగా 535 మంది మరణించారు.
తాజా వార్తలు
- జూలై 1 నుంచి 3 వరకు భారత్లో పర్యటించనున్న జపాన్ ప్రధాని
- మాదకద్రవ్యాల పై సమగ్ర యుద్ధం ప్రకటిద్దాం: తెలంగాణ పోలీస్
- ఒమాన్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాల హెచ్చరిక..
- యూఏఈలో తప్పుడు ఎమర్జెన్సీ అలర్ట్లు..సాంకేతిక లోపమే కారణం: NCEMA
- దుబాయ్ ఆవిష్కరణల స్ఫూర్తికి ప్రతీక 'దుబాయ్-ఇట్' కార్యక్రమం
- ఏడాది చివరినాటికి అబుదాబిలో ఎయిర్ టాక్సీ సేవలు..
- ఇరాన్ విదేశాంగ మంత్రితో యూఏఈ విదేశాంగ మంత్రి అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్ సంభాషణ
- RTGS సేవల పై మంత్రి నారా లోకేశ్ ఉన్నతస్థాయి సమీక్ష
- నాగ్పూర్ విమానాశ్రయం జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ పోర్ట్ఫోలియోలో చేరిక
- సీఎం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..







