భారత్ లోకి మంకీపాక్స్ ఎంట్రీ
- September 09, 2024
న్యూ ఢిల్లీ: భారత దేశంలో మంకీపాక్స్ అనుమానిత కేసు వెలుగులోకి వచ్చింది. రోగిని ఐసోలేషన్లో ఉంచినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. చింతించాల్సిన పనిలేదని స్పష్టం చేసింది. అనుమానాస్పద మంకీపాక్స్ కేసులో పరీక్షలు జరుగుతున్నాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఓ యువకుడికి ఇలాంటి లక్షణాలు కనిపించాయి. అతడు ఇటీవల మంకీపాక్స్ ఇన్ఫెక్షన్ ఉన్న దేశంలో ప్రయాణించినట్లు కనుగొన్నారు. ఇటీవల మన దేశానికి తిరిగి వచ్చాడు. అతని శరీరంపై మంకీపాక్స్ కు సంబంధించిన లక్షణాలు కనిపించాయి. రోగిని నియమించబడిన ఆసుపత్రిలో ఐసోలేట్ చేశారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉంది. ఈ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించి, ఆరోగ్య సేవలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో అన్ని సంబంధిత శాఖలు మరియు ఏజెన్సీలు అప్రమత్తంగా ఉన్నాయి. పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నాయి. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్సిడిసి) ఈ విషయాన్ని పరిశీలిస్తున్నందున ఈ విషయంపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇలాంటి ప్రయాణ సంబంధిత విషయాలను ఎదుర్కోవడానికి దేశం సిద్ధంగా ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ కూడా తెలియజేసింది. అలాగే, అటువంటి కేసులను గుర్తించడానికి ట్రేసింగ్ ఛానల్ ఏర్పాటు చేయబడింది. ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న వందలాది మంకీపాక్స్ కేసులు మరో మహమ్మారికి దారి తీసే అవకాశంలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అయితే ఈ వ్యాధి గురించి తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయని చెప్పింది. మంకీపాక్స్ ఎలా వ్యాప్తి చెందుతుందనే విషయం సహా దశాబ్దాల కిందే మశూచి టీకాల కార్యక్రమాన్ని నిలిపివేయడం వల్ల ఇది వేగంగా సంక్రమించడానికి వీలవుతుందా అనేది తెలియాల్సి ఉందని పేర్కొంది. ప్రపంచదేశాల్లో వెలుగుచూస్తున్న మంకీపాక్స్ కేసుల్లో అధిక శాతం స్వలింగ, ద్విలింగ సంపర్కులు, పురుషులతో లైంగిక సంబంధాలు కలిగి ఉన్న పురుషుల్లోనే అనేది నొక్కి చెప్పడం ముఖ్యమని డబ్ల్యూహెచ్ఓ డా.రోజమండ్ లూయిస్ సోమవారం ఓ సభలో అన్నారు. అప్పుడే దీనిపై శాస్త్రవేత్తలు లోతుగా పరిశోధనలు చేయగలరగని, రిస్క్ ఎక్కువగా ఉన్నవారు జాగ్రత్తలు తీసుకోగలరని చెప్పారు. అయితే లైంగిక ధోరణితో సంబంధంలేకుండా ఎవరికైనా వ్యాధి సోకే ప్రమాదముందని హెచ్చరించారు.
తాజా వార్తలు
- జూలై 1 నుంచి 3 వరకు భారత్లో పర్యటించనున్న జపాన్ ప్రధాని
- మాదకద్రవ్యాల పై సమగ్ర యుద్ధం ప్రకటిద్దాం: తెలంగాణ పోలీస్
- ఒమాన్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాల హెచ్చరిక..
- యూఏఈలో తప్పుడు ఎమర్జెన్సీ అలర్ట్లు..సాంకేతిక లోపమే కారణం: NCEMA
- దుబాయ్ ఆవిష్కరణల స్ఫూర్తికి ప్రతీక 'దుబాయ్-ఇట్' కార్యక్రమం
- ఏడాది చివరినాటికి అబుదాబిలో ఎయిర్ టాక్సీ సేవలు..
- ఇరాన్ విదేశాంగ మంత్రితో యూఏఈ విదేశాంగ మంత్రి అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్ సంభాషణ
- RTGS సేవల పై మంత్రి నారా లోకేశ్ ఉన్నతస్థాయి సమీక్ష
- నాగ్పూర్ విమానాశ్రయం జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ పోర్ట్ఫోలియోలో చేరిక
- సీఎం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..







